యాప్నగరం

Bhadrachalam: 'ఇచ్చట బూజు పట్టిన లడ్డూ ప్రసాదం అమ్మబడును'

Bhadrachalam: తెలంగాణలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం రామాలయంలో భక్తులకు బూజు పట్టిన లడ్డూలు పంపిణీ చేయటం కలకలం రేపుతోంది. ఎంతో పవిత్రంగా భావించే భద్రచాలం శ్రీరాముడి ప్రసాదంలో బూజుపట్టిన లడ్డూలు రావటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రసాదం కౌంటర్ పై 'ఇచ్చట బూజు పట్టిన లడ్డూలు అమ్మబడును' అని రాసిన పేపర్‌ను అతికించి నిరసన తెలిపారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 8 Jan 2023, 4:27 pm

ప్రధానాంశాలు:

  • భద్రాచలంలో బూజు పట్టిన లడ్డూల విక్రయం
  • ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు
  • వినూత్నరీతిలో నిరసన
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Bhadrachalam laddu
భద్రాచలం రామాలయంలో బూజు పట్టిన లడ్డూల విక్రయం
Bhadrachalam: తెలంగాణలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం రామాలయం. భద్రాద్రిలో కొలువైన రాములోరిని దర్శించుకోవటానికి తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటూరు. రామయ్యను దర్శించుకొని, మెక్కులు తీర్చుకొని లడ్డూ ప్రసాదం కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిల్చొని కొనుగోలు చేస్తుంటారు. అయితే స్వామి వారి మహా ప్రసాదంగా భావించే లడ్డూ నాణ్యతలో డొల్లతనం బయటపడింది.
భక్తులకు పంపిణీ చేసే లడ్డూలు బూజు పట్టడం కలకలం రేపుతోంది. ఫంగస్, బూటు పట్టిన లడ్డూలు పంపిణీ చేయటంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వామి వారి మహా ప్రసాదంగా భావించే లడ్డూల్లో నాణ్యతత లేకుండా బూజు పట్టిన లడ్డూలు పంపిణీ చేయటమేంటని ఆలయ అధికారులను నిలదీస్తున్నారు. ప్రసాదం కౌంటర్ పై ‘ఇచ్చట బూజు పట్టిన లడ్డూలు అమ్మబడును’ అని రాసిన పేపర్ ను అతికించి నిరసన తెలిపారు.

ఇటీవల ముక్కోటి పర్వదినం సందర్భంగా భక్తులకు అందించేందుకు గాను ఆలయ అధికారులు సుమారు రెండు లక్షల లడ్డూలు తయారు చేయించారు. భక్తులకు విక్రయించగా.. మిగిలిపోయన లడ్డూలను గదిలో భద్రపరిచారు. అయితే భద్రపరిచే విషయంలో ఆలయ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో వాటిపై ఫంగస్ ఏర్పడింది. వాటిని పక్కన పెట్టకుండా నిర్లక్ష్యంగా ప్రసాదం విక్రయ కౌంటర్లకు తరలించారు. భక్తులు వాటిని పరిశీలించగా.. బూజు పట్టి ఉన్నాయి. దీంతో ఆలయ అధికారుల తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై ఆలయ అధికారులు స్పందించాల్సి ఉంది.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.