యాప్నగరం

Godavari మళ్లీ ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక.. ఆందోళనలో ప్రజలు

గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. వాయుగుండం ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద పోటెత్తింది. నెల రోజుల కిందట నదికి ఊహించని వరదలు రావడంతో ఇరు తెలుగు రాష్ట్రాలకు భారీ నష్టమే చేకూరింది. మళ్లీ ఇప్పుడు మరోసారి గోదావరి ప్రమాదకరంగా మారడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రాచలం వద్ద గోదావరి 54.3 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

Edited byరావు | Samayam Telugu 17 Aug 2022, 7:57 am

ప్రధానాంశాలు:

  • భద్రాచలం వద్ద 54.3 అడుగులకు చేరిన గోదావరి
  • మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు
  • అప్రమత్తమైన ఇరు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Godavari
భద్రాచలం వద్ద గోదావరి (ఫైల్)
గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. వాయుగుండం ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద పోటెత్తింది. నెల రోజుల కిందట నదికి ఊహించని వరదలు రావడంతో ఇరు తెలుగు రాష్ట్రాలకు భారీ నష్టమే చేకూరింది. మళ్లీ ఇప్పుడు మరోసారి గోదావరి ప్రమాదకరంగా మారడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రాచలం వద్ద గోదావరి నిన్న రాత్రి 53 అడుగులకు చేరగా మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇవాళ ఉదయానికి 54.3 అడుగులకు చేరడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.
భద్రాచలం, పినపాక నియోజవర్గాల్లో పలు ప్రాంతాల్లో రోడ్ల మీదకు ఇప్పటికే నీళ్లు చేరాయి. భద్రాచలం నుంచి చర్ల వెంకటాపురం రహదారి మీదికి వరద నీళ్లు భద్రాచలం నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్లే రహదారిపై నీళ్లు చేరాయి. దాంతో ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి ఎస్పీ డాక్టర్ వినీత్ కోరారు. దుమ్ముగూడెం, అశ్వాపురం, మణుగూరు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం హెచ్చరించింది.

మంగళవారం రాత్రి భద్రాచలయం వద్ద గోదావరి నీటిమట్టం 53 అడుగులు దాటింది. ప్రస్తుతం ఇక్కడి నుంచి 13.86 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు ప్రవహిస్తోంది. దాంతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాల్లోకి కూడా వరద నీరు చేరుతోంది. చింతూరు వద్ద శబరి ప్రవాహం కూడా భారీగా పెరిగింది. శబరి నది 42 అడుగులకు చేరింది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌కు రాకపోకలను అధికారులు నిలిపేశారు.

పోలవరం ప్రాజెక్ట్ స్పిల్‌వే 48 గేట్ల నుంచి వచ్చిన వరదను అలానే దిగువకు వదులుతున్నారు. ధవళేశ్వరం, కాటన్ బ్యారేజీ వద్ద నటిమట్టం 13.90 అడుగులకు చేరిందని అధికారులు తెలిపారు. గోదావరి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు 10,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ మిగిలిన 13,08,418 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.
రచయిత గురించి
రావు
గోనె.మహేష్ సమయం తెలుగులో కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ వెబ్‌స్టోరీ విభాగానికి సంబంధించి స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.