యాప్నగరం

ఖమ్మం: బీజేపీ నేత‌ దారుణ హత్య, ఇంట్లోకి చొరబడి కత్తి పోట్లు.. కారణమదేనా?

Wyra: రామారావుపై దుండగుడు తొలుత కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేయగా.. ఆయన పరిస్థితి విషమంగా మారింది. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం హుటాహుటిన ఖమ్మంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రామారావు చనిపోయారు.

Samayam Telugu 26 Dec 2020, 10:11 am
ఖమ్మం జిల్లాలో దుండగులు రెచ్చిపోయారు. బీజేపీకి చెందిన ఓ నేతపై గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్రంగా కలకలం రేపింది. దుండగుడి దాడిలో రామారావు అనే బీజేపీ నేత మరణించారు. వైరా మండలంలో బీజేపీ నాయకుడు నేలవెళ్లి రామారావుపై దుండగుడు తొలుత కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేయగా.. ఆయన పరిస్థితి విషమంగా మారింది. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం హుటాహుటిన ఖమ్మంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రామారావు చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Samayam Telugu చనిపోయిన బీజేపీ నేత రామారావు
khammam bjp leader


ఉదయం 8 గంటల ప్రాంతంలో బైక్‌పై హెల్మెట్‌లు ధరించి రామారావు ఇంటికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. ఇంట్లోకి ప్రవేశించి రామారావుపై ఏకధాటిగా కత్తులతో దాడి చేసి పరారైనట్లుగా స్థానికులు చెప్పారు. రామారావు బీజేపీలో ఆర్టీఐ సెల్ కన్వీనర్‌గా పని చేస్తున్నాడు. రామారావుపై దాడికి ఆర్థిక లావాదేవిలే కారణమా ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలిసులు విచారణ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.