యాప్నగరం

Old Currencyని కొత్త నోట్లుగా మార్చే స్వామిజీ.. రూ. 1.65 కోట్లు తరలింపు.. ఈలోగా..

Old Currency: రద్దయిన పాత నోట్లు (Banned Currency) , నకిలీ కరెన్సీని (Fake Currency) తరలిస్తున్న ముఠాను ములుగు జిల్లా పోలీసులు అదుపులోకి పట్టుకున్నారు. వెంకటాపురంలో (Venkatapuram) తనిఖీ చేపట్టిన పోలీసులు రెండు వాహనాల్లో భద్రాచలం నుంచి హైదరాబాద్ తరలిస్తున్న రద్దయిన రూ.1000, రూ.500 నోట్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నోట్ల విలువ సూమారు రూ.1.65 కోట్లు ఉంటుందని ములుగు ఎస్పీ వెల్లడించారు. ఈ వ్యవహారంలో 8 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 7 Oct 2022, 1:39 pm
Old Currency: రద్దయిన పాతనోట్లను ఓ స్వామీజీ కొత్త కరెన్సీగా మారుస్తాడని నమ్మి కోటి 65 లక్షల రూపాయలు తరలిస్తున్న ముఠాను తెలంగాణలోని ములుగు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ తెలిపిన వివరాల ప్రకారం... సూర్యాపేట జిల్లా కేశవాపూర్‌కు చెందిన పప్పుల నాగేంద్రబాబు అప్పులపాలు కావడంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే వ్యాపారం చేయాలని భావించాడు. ఈ క్రమంలో తన స్నేహితుడైన కోదాడ మండలం సాలర్జింగ్‌పేటకు చెందిన శ్రీరాముల నాగేశ్వరరావు అలియాస్ నగేశ్‌ను కలిశాడు.
Samayam Telugu fake new
ములుగు పాత నోట్లు


ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ బాబా పాత కరెన్సీని కొత్త నోట్లుగా మారుస్తాడని నగేశ్ చెప్పడంతో నాగేంద్రబాబు ఆశపడ్డాడు. త్వరగా అప్పులు తీర్చి డబ్బు సంపాదించుకోవచ్చునని అనుకున్నాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు చెందిన వెంకటరెడ్డి, నవీన్‌రెడ్డికి 5 లక్షలిచ్చి వారి నుంచి 2 కోట్లు విలువచేసే రూ.1000, రూ.500 పాత కరెన్సీ, దొంగ నోట్లు కొనుగోలు చేశారు. ఆ సొమ్ముతో భద్రాచలం నుంచి ములుగు జిల్లా వెంకటాపురం మీదుగా హైదరాబాద్ తరలిస్తూ పోలీసులు పట్టుబడ్డారు.

నాగేంద్రబాబుతో పాటు భద్రాచలం ఏఎంసీ కాలనీకి చెందిన మారె సాంబశివరావు, ములుగు జిల్లా వెంకటాపురానికి చెందిన బెజ్జంకి సత్యనారాయణ, నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఎక్కనాడే గ్రామానికి చెందిన వడ్డి శివరాజ్, హైదరాబాద్ ఉప్పల్ బుద్ధానగర్‌కు చెందిన ఆయుర్వేద వైద్యుడు గంటా యాదగిరి, మలక్‌పేట బ్యాంక్ కాలనీకి చెందిన ఠాకూర్ అజయ్‌సింగ్, చత్తీస్‌గఢ్‌కు చెందిన ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి పాత కరెన్సీ, దొంగ నోట్లు, రెండు కార్లు, 9 ఫోన్లు, రూ. 5 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.