యాప్నగరం

Kothagudem: బొగ్గు లారీ బీభత్సం.. మూడు పల్టీలు కొట్టిన ఆర్టీసీ బస్సు

Kothagudem Accident: భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లాలో బొగ్గులోడ్‌తో వెళ్తున్న ఓ టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. మీతిమీరిన వేగంతో ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో బస్సు మూడు పల్టీలు కొట్టగా.. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 30 Apr 2023, 11:23 am

ప్రధానాంశాలు:

  • కొత్తగూడంలో రోడ్డు ప్రమాదం
  • లారీ, ఆర్టీసీ బస్సు ఢీ
  • పలువురు ప్రయాణికులకు గాయాలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
RTC Bus Accident: భద్రాద్రి కొత్తగూడెంలో ఓ బొగ్గు లారీ బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు మూడు పల్టీలు కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ప్రయాణికులు ఉండగా.. అందులో 43 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఆదివారం ఉదయం భద్రాచలం డిపో నుంచి ఓ ఆర్టీసీ బస్సు విజయవాడ బయల్దేరింది. మెుత్తం 47 మంది ప్రయాణికులతో బస్సు విజయవాడకు బయల్దేరింది.
కొత్తగూడెం జిల్లా చంచుపల్లి మండలం ఆనందగనికి వద్దకు రాగానే.. ఓ బొగ్గు లారీ ఆర్టీసీ బస్సును అతివేగంగా ఢీకొట్టింది. దీంతో ఆర్టీసీ బస్సు మూడు పల్టీలు కొట్టి రహదారిపై బోల్తాపడింది. మెుత్తం ప్రయాణికుల్లో 43 మంది గాయపడ్డారు. వారిలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. మిగిలిన వారు స్వల్పంగా గాయపడ్డారు. గాయాలు, చిన్న పిల్లల ఏడుపులతో ఆ ప్రాంతంలో భీతావాహ పరిస్థితి నెలకొంది. సకాలంలో స్పందించిన స్థానికులు క్షతగాత్రులను కొత్తగూడెంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో విజయవాడ, నూజివీడు, కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు.

"ఉదయం పాల్వంచ నుంచి విజయవాడ బయల్దేరాం. దుర్గంపూర్ దాటగానే వేగంగా వచ్చిన టిప్పర్ లారీ బస్సు వెనకు సైడ్ డ్యాష్ ఇచ్చింది. దీంతో బస్సు మూడు పల్టీలు కొట్టింది. ఏం జరుగుతోందే తెలిసేలోపే మేమంతా కిందపడిపోయి గాయాలతో ఉన్నాం. ఆ సమయంలో బస్సు మెుత్తం ప్రయాణికులతో నిండుగా ఉంది. ఓ నలుగురు వృద్ధులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఇందులో బస్సు డ్రైవర్ తప్పేం లేదు. నాలుగు రోడ్ల జంక్షన్‌లో స్పీడ్ బ్రేకర్లు లేకపోవటంతో టిప్పర్ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది." అని ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ఓ ప్రత్యక్షసాక్షి వివరించారు.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.