ఖమ్మం జిల్లాలో మరోసారి కరోనా కలకలం రేగింది.. ఓ స్కూల్ టీచర్కు కరోనా సోకడం.. ఆయన కూతురు ఇటీవలే విదేశాల నుంచి వచ్చి తెలియడంతో అధికారులకు టెన్షన్ పట్టుకుంది.. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు బయటపడుతున్న నేపథ్యంలో అధికారులు అలెర్ట్ అయ్యారు.. వివరాల్లోకి వెళ్తే.. మామిళ్లగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని మ్యాథ్స్ టీచర్గా విధులు నిర్వర్తించే సోలా శ్రీనివాసరావుకి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అయితే ఆయన కుమార్తె ఇటీవలే అమెరికా నుంచి తిరిగొచ్చారు. విదేశాల నుంచి వచ్చిన వారు ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడుతున్న నేపథ్యంలో జిల్లా వైద్యాధికారులు అప్రమత్తం అయ్యారు.
టీచర్కు కరోనా పాజిటివ్ అని తేలడంతో.. ఆయన పని చేస్తున్న పాఠశాలలో విద్యార్థులకు కరోనా టెస్టులు చేస్తున్నారు. గత నెలలో.. వైరా గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. 27 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది..
టీచర్కు కరోనా పాజిటివ్ అని తేలడంతో.. ఆయన పని చేస్తున్న పాఠశాలలో విద్యార్థులకు కరోనా టెస్టులు చేస్తున్నారు. గత నెలలో.. వైరా గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. 27 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది..