యాప్నగరం

కంపించిన భూమి... ఊగిపోయిన ఇళ్లు.. కానీ భూకంపం కాదు

అక్కడున్న ప్రజలకు ఇవన్నీ సర్వసాధారణం అయిపోయాయి. నిత్యం భూమికంపించేలా శబ్ధాలు రావడం, ఇళ్లు ఊగడం, గోడలు పెచ్చులూడటం కూడా మామూలుగా మారాయి. దీంతో జనం నిత్యం భయంతో బతుకుతున్నారు.

Samayam Telugu 28 Feb 2021, 2:48 pm
భూమి ఒక్కసారిగా కంపించింది. ఇళ్లన్నీ ఊగిపోయాయి. దీంతో జనం ఒక్కసారిగా భయపడిపోయారు. అరుపులు, కేకలతో ప్రజలు రోడ్లపైకి పరుగులు పెట్టారు. చుట్టూ కమ్ముకున్న పొగతో ఏం జరుగుతుందో అర్థంకాని స్థితిలో ఆందోళనలో పడ్డారు. అయితే ఎవరైనా ఇవన్నీ చూస్తే భూకంపమే అనుకుంటారు. అయితే ఇదంతా మాత్రం అక్కడున్న వారికి మాత్రం అలవాటే. అలవాటే కాదు వారికి ఇది నిత్యకృత్యంగా మారింది.
Samayam Telugu సింగరేణి బొగ్గు గనుల్లో బ్లాస్ట్


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు సింగరేణి గనుల పరిధిలోని ప్రాంతంలో ప్రతిరోజూ మధ్యాహ్నం ఓసీలో బొగ్గు కోసం సింగరేణి అధికారులు బ్లాస్టింగ్‌ చేపడతారు. ఈ క్రమంలో వాటి శబ్దాలకు శనివారం భూ ప్రకంపనలు రావడంతో ఏం జరుగుతుందోనని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. కొంతకాలంగా ఓసీ బ్లాస్టింగ్‌ శబ్దాలు, భూమి కంపనాలతో పట్టణ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

రోడ్డెక్కి ఆందోళనలు చేసినా పరిష్కారం చూపడం లేదంటున్నారు. దీనిపై సింగరేణి అధికారులకు మొరపెట్టుకున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని బస్తీలకు చెందినవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఓసీ బ్లాస్టింగ్‌లతో గోడలు బీటలు వారి ఇళ్లు ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. అధికారులు పట్టించుకొని తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.