యాప్నగరం

Bhadradri: కన్నుల పండువగా భద్రాద్రి రాములోరి కల్యాణం

Sri Rama Navami Celebrations: శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలోని మిథిలా ప్రాంగణంలో రాములోరి కళ్యాణం వైభవంగా జరిగింది. త్రిదండి చినజీయస్వామి సమక్షంలో ఈ కత్రువును జరిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 30 Mar 2023, 2:13 pm

ప్రధానాంశాలు:

  • ఘనంగా భద్రాద్రి రాములోరి కల్యాణం
  • పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
  • భక్తజన సందోహంతో నిండిపోయిన మిథిలా ప్రాంగణం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Bhadrachalam
భద్రాచలం రాములోరి కల్యాణం
Bhadrachalam: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో వేడుకలు వైభవంగా జరిగాయి. ఆకాశమంత పందిరి.. భూదేవంత మండపం... వేద పండితుల మంత్రోచ్ఛారణలు.. భక్తజన సందోహం మధ్య రాములోరి కల్యాణోత్సవం కనులపండువగా సాగింది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్‌ లగ్నంలో జగన్మాత సీతమ్మ మెడలో శ్రీరామచంద్రుడు మాంగల్య ధారణ చేశారు. ఈ మహోత్సవానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ రెడ్డి దంపతులు హాజరై ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను స్వామి వారికి అందజేశారు. మిథిలా మైదానంలో కిక్కిరిసిన భక్తజనసందోహం మధ్య త్రిదండి చినజీయస్వామి సమక్షంలో అర్చకులు సాంప్రదాయ బద్ధంగా కల్యాణ క్రతువును వైభవంగా జరిపించారు.
ప్రతి ఏడాది కంటే ఈసారి భిన్నంగా శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించారు. ఈసారి సువర్ణ ద్వాదశ వాహనాలపై సీతారాముల్ని ఊరేగించారు. భక్తరామదాసు కాలంలో ఇలా సువర్ణ ద్వాదశ ఊరేగింపు కార్యక్రమం జరిగిందని అర్చకులు తెలిపారు. తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశం నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు ఆ కల్యాణమహోత్సవంలో పాల్గొన్నారు. ప్రభుత్వం భక్తులకు ఎటువంటి లోటుపాట్లు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. కల్యాణం వీక్షించేందుకు వీఐపీతో పాటు 26 సెక్టార్లు.. ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. భక్తులకు అందుబాటులో రెండు లక్షల లడ్డు ప్రసాదాలు, 200 క్వింటాల తలంబ్రాలు.. వాటి పంపిణీ చేసేందుకు గాను 70 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇక రేపు (శుక్రవారం) స్వామివారికి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించనున్నారు.

ఈ కళ్యాణ మహోత్సవానికి ఎంపీ వద్దిరాజు రవి చంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ హాజరయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ తదితరులు హాజరయ్యారు.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.