యాప్నగరం

టెన్త్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. మూడంస్తుల భవనంపై నుంచి దూకి..

హైదరాబాద్‌లో సాత్విక్ ఘటన మరవక ముందే.. ఖమ్మంలో మరో విద్యార్థిని సూసైడ్‌కు యత్నించింది. ఖమ్మంలోని ఓ కార్పొరేట్ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని.. స్కూల్ మూడో అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నంచింది. కిందపడిన అమ్మాయికి తీవ్ర గాయాలయ్యాయి. అమ్మాయి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 3 Mar 2023, 10:21 pm

ప్రధానాంశాలు:

  • ఖమ్మంలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం
  • స్కూల్ మూడంస్తుల భవనం నుంచి దూకిన విద్యార్థిని
  • అమ్మాయికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Sri chaithanya school
శ్రీ చైతన్య స్కూల్
తెలంగాణలో మరో విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. ఖమ్మం నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్‌లో ఉన్న కార్పొరేట్ స్కూల్‌లో టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థిని మూడు అంతస్తుల బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. కింద పడిన విద్యార్థిని కాలికి తీవ్ర గాయమైంది. కాలు విరిగి ఎముక బయటికి వచ్చింది. దీంతో.. విద్యార్థినిని హుటాహుటిన ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే.. అమ్మాయి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే.. విద్యార్థిని ఎందుకు ఆత్మహత్యకు యత్నించిందనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఒత్తిడి కారణంగానే.. ఆత్మహత్యకు యత్నించిందా.. లేకపోతే మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఇదే విషయమై స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా.. విద్యార్థిని ప్రమాదవశాత్తు కిందపడిందని చెప్తున్నారు. విషయం తెలుసుకున్న పీడీఎస్‌యూ నేతలు.. పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. స్కూల్ యాజమాన్యం ఒత్తిడి వల్లే విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించిందని ఆరోపిస్తూ.. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. విద్యార్థినికి న్యాయం చేయాలని.. మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.

ఇటీవలే.. ఒత్తిడి తట్టుకోలేక హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో సాత్విక్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవటం సంచలనంగా మారింది. ఆత్మహత్యకు ముందు విద్యార్థి సూసైడ్ నోట్ కూడా రాయటం.. అందులో తనను ఒత్తిడికి గురి చేసిన లెక్చరర్ల పేర్లు కూడా రాశాడు. దీంతో.. ఈ ఘటనపై సర్కారు దిగివచ్చి ప్రత్యేక కమిటీ వేయటమే కాకుండా.. విద్యార్థి పేర్కొన్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

Medchal: గుండెపోటుతో బీటెక్ విద్యార్థి మృతి.. సీఎంఆర్ కాలేజీలో విషాదం
  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.