యాప్నగరం

Thummala: ఏ క్షణమైనా పిడుగు లాంటి వార్త వినొచ్చు.. తుమ్మల కీలక వ్యాఖ్యలు

Thummala Nageswara Rao: మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ ముఖ్య నేత తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ క్షణమైనా పిడుగు లాంటి వార్త వినొచ్చు, సిద్దంగా ఉండాలని అనుచరులతో అన్నారు. గతంలో చోటు చేసుకున్న తప్పులు మళ్లీ జరగకుండా చూసుకోండని సూచించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పర్యటించిన తుమ్మల.. పార్టీ కార్యకర్తలు, ముఖ్య అనుచరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేయడం ఖాయమని స్పష్టం చేశారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 4 Aug 2022, 3:08 pm
మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) ముఖ్య నేత తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ క్షణమైనా పిడుగు లాంటి వార్త వినొచ్చు అన్నారు. గతంలో చోటు చేసుకున్న తప్పులు మళ్లీ జరగకుండా చూసుకోండని అనుచరులు సూచించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పర్యటించిన తుమ్మల.. పార్టీ కార్యకర్తలు, తన ముఖ్య అనుచరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పాలేరు (Paleru) నుంచి పోటీ చేయడం ఖాయమని అనుచరులకు స్పష్టం చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధిపైనే దృష్టి పెట్టానని, కార్యకర్తలను పూర్తి స్థాయిలో కలవలేకపోయానని తుమ్మల అన్నారు. ‘గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం తిరిగా.. ఇప్పుడు మాత్రం పాలేరు పైనే దృష్టి పెట్టా’ అని తుమ్మల అన్నారు.
Samayam Telugu Thummala Nageswara Rao
తుమ్మల నాగేశ్వర రావు


పాలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలో దిగే యోచనలో ఉన్న తుమ్మల నాగేశ్వర రావు ఇప్పటికే అందుకనుగుణంగా కసరత్తు చేస్తున్నారు. నియోజకవర్గంలో కలియ తిరుగుతూ తన అనుచరులను కలుస్తున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ నుంచి టికెట్ దక్కినా, దక్కకపోయినా.. స్వతంత్రంగానైనా, ఇతర పార్టీ నుంచైనా పోటీ చేయడం ఖాయమనే సంకేతాలను తుమ్మల తన అనుచరులకు ఇస్తున్నారా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఖమ్మం జిల్లా నుంచి తెలంగాణలో కీలక నేతగా, కేసీఆర్‌కు ఆప్తుడిగా వెలుగు వెలుగిన తుమ్మల నాగేశ్వర రావు కిందటిసారి ఎన్నికల్లో (2018) పాలేరులో కాంగ్రెస్ అభ్యర్థిపై 1950 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన కందాల ఉపేందర్ రెడ్డి ఆ తర్వాత టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం పాలేరులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఉపేందర్ రెడ్డి కూడా టీఆర్‌ఎస్ నుంచి టికెట్ రేసులో ఉన్నారు.

ఎన్టీఆర్‌ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన తుమ్మల.. టీడీపీ తరఫున సత్తుపల్లి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ ఆహ్వానంతో టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరారు. ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారారు.

వాస్తవానికి తుమ్మల నాగేశ్వర రావుది సత్తుపల్లి నియోజకవర్గం. కానీ, అది ఎస్సీ రిజర్వ్‌డ్ కావడంతో ఆయన 2009 ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభంజనంలో ఓడిపోయిన తుమ్మల.. రాష్ట్ర విభజన తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ.. నియోజకవర్గ ప్రజలకు కాస్త దూరం కావడం ఆయనకు ప్రతికూలంగా మారింది. ఈ నేపథ్యంలో 2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.