యాప్నగరం

TSRTC : గరుడ బస్సులో మంటలు.. 60 మంది ప్రయాణికులు, కలకలం

ఆర్టీసీ ఏసీ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపివేసి ప్రయాణికులను కిందకు దించేయడంతో పెనుప్రమాదం తప్పింది.

Samayam Telugu 14 Nov 2021, 8:50 pm
టీఎస్ఆర్టీసీ ఏసీ గరుడ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి భద్రాచలం వెళ్తున్న ఏసీ బస్సులో మంటలు చెలరేగాయి. ఖమ్మం జిల్లా వైరాలో ఈ ఘటన జరిగింది. వైరా సెంటర్‌ వద్ద బస్సులో మంటలు వ్యాపించడం గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేశాడు. ప్రయాణికులను హుటాహుటిన బస్సులో నుంచి కిందకు దించేశాడు. మంటలు వ్యాపిస్తుండడంతో వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
Samayam Telugu బస్సులో మంటలు


ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. మంటలు గమనించి బస్సు డ్రైవర్ ప్రయాణికులను దించేయడంతో పెనుప్రమాదం తప్పింది. బస్సులో మంటలు చూసి ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. ఏ అర్ధరాత్రో ఇలా జరిగి ఉంటే తమ పరిస్థితేంటని భీతిల్లిపోయారు. ప్రయాణికుల కోసం మరో బస్సు ఏర్పాటు చేయనున్నారు. ప్రమాద కారణాలు తెలియాల్సి ఉంది. మరోమారు ఇలాంటి ఘటనలు జరగకుండా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.