యాప్నగరం

Khammam: వైరా ఎమ్మెల్యే కోడలికి అవార్డు.. ఢిల్లీలో అరుదైన గౌరవం

అధికార టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కోడలికి అరుదైన గౌరవం లభించింది. ఉత్తమ సేవలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులమీదుగా అత్యుత్తమ అవార్డును అందుకున్నారు. ఆమె సీఐఎస్‌ఎఫ్‌లో అధికారిగా పనిచేస్తున్నారు.

Samayam Telugu 27 Jan 2021, 2:32 pm

ప్రధానాంశాలు:

  • పోలీస్ మెడల్ అందుకున్న ఎమ్మెల్యే కోడలు
  • రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రదానం
  • హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే నాయక్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ కోడలు అరుదైన ఘనత సాధించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ కైవసం చేసుకున్నారు. రాష్ట్రపతి చేతులమీదుగా భారత పోలీస్ సేవా పతకం అందుకున్నారు. ఎమ్మెల్యే రాములు నాయక్ కోడలు శిప్ర శ్రీవాస్తవ్ సీఐఎస్‌ఎఫ్(సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్)లో అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
ఆమె 2020 ఏడాదికి ఉత్తమ పోలీసు సేవా పతకానికి ఎంపికయ్యారు. విధి నిర్వహణలో శ్రీవాస్తవ్ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆమెను జాతీయ పోలీస్ సేవా పతకానికి ఎంపిక చేసింది. ఢిల్లీలో జరిగిన 72వ రిపబ్లిక్ డే వేడుకల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులమీదుగా పోలీస్ మెడల్ అందుకున్నారు. ఆమె భర్త, ఎమ్మెల్యే కుమారుడు జీవన్‌లాల్ ఐఆర్‌ఎస్ అధికారిగా ఉన్నారు. ముంబైలో ఆదాయ పన్ను శాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కోడలికి పతకం రావడంపై ఎమ్మెల్యే రాములు నాయక్ సంతోషం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.