యాప్నగరం

పత్తిచేనులో తల్లి తిట్టిందని... యువతి ఆత్మహత్య

తండ్రి నాలుగేళ్ల క్రితం చనిపోవడంతో.. తల్లికి చేదోడు వాదోడుగా ఉంటుంది కూతురు చందన. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి పత్తిచేనులో పనికోసం వెళ్లారు.

Samayam Telugu 25 Dec 2020, 6:56 am
తల్లి తిట్టిందని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కన్నతల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి పురుగుమందు తాగి మృతి చెందింది. ఖమ్మం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బంజర గ్రామానికి చెందిన పూనెం చంద్రకళ, వసంతరావు దంపతుల ఒక్కగానొక్క కుమార్తె చందన (17). తండ్రి నాలుగేళ్ల క్రితం చనిపోవడంతో ఆ యువతి తల్లికి తోడుగా కూలికి వెళ్తోంది. గురువారం కూడా పత్తి తీసేందుకు వెళ్లగా పనిలో వెనకబడుతున్నావని తల్లి మందలించింది.
Samayam Telugu తల్లి తిట్టిందని కూతురు ఆత్మహత్య


Read More: డయల్ 100కు పెళ్లికూతురు ఫోన్.. పోలీసుల ఎంట్రీ, పీటల మీదే ఆగిన పెళ్లి

దీంతో చందన తీవ్ర మనస్తాపానికి గురైంది. తల్లి తనను తిట్టిందని లోలోపల మదనపడిపోయింది. దీంతో ఇంటికి వచ్చిన చందన ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పురుగుల మందు తాగింది. బంధువులు యువతిని ఉల్వనూరు పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. పాల్వంచకు తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.