యాప్నగరం

Ys Sharmila: కేసీఆర్‌కు పరిపాలన చేతకావడం లేదు.. కనీసం రేషన్ కార్డు కూడా ఇవ్వలేని దిక్కుమాలిన పాలన: వైఎస్ షర్మిల

సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైఎస్సార్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల.. కేసీఆర్ పరిపాలనలో ఏ వర్గం బాగుపడలేదన్నారు. కనీసం బియ్యం కార్డు కూడా ఇవ్వలేని దిక్కుమాలిన పాలన కేసీఆర్‌ది అంటూ విమర్శలు గుప్పించారు.

Authored byRaj Kumar | Samayam Telugu 15 Jun 2022, 3:26 pm
వైఎస్సార్‌‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఖమ్మం జిల్లా మధిర నియోజక వర్గంలో సాగుతోంది. ఈ సందర్భంగా చింతకాని గ్రామ ప్రజలతో వైఎస్ షర్మిల మాట్లాడారు. అనంతరం నిర్వహించిన సభలో ఆమె ప్రసంగించారు. సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ పరిపాలనలో ఏ వర్గం బాగుపడలేదని షర్మిల ఫైర్ అయ్యారు. కనీసం బియ్యం కార్డు కూడా ఇవ్వలేని దిక్కుమాలిన పాలన కేసీఆర్‌ది అంటూ విమర్శలు గుప్పించారు. రెండు సార్లు కేసీఆర్‌ను నమ్మితే తెలంగాణ‌ను అప్పుల పాలు చేశారని దుయ్యబట్టారు. 8 ఏళ్లలో రాష్ట్రంలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Samayam Telugu YS Sharmila


‘వైఎస్సార్ హయాంలో 46 లక్షల పక్కా ఇళ్లు కట్టిస్తే.. కేసీఆర్ హయాంలో ఎన్ని ఇళ్లు ఇచ్చారో చెప్పాలి. కేసీఆర్ పాలనలో ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కేసీఆర్‌‌కు పరిపాలన చేతకావడం లేదు. కేసీఆర్‌కు పరిపాలనపై చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే కనీసం గ్రామానికి ఒక్క ఇల్లు అయినా వచ్చేది. రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి నెరవేర్చాడా? మళ్లీ కేసీఆర్ పాలన మనకు అవసరమా? ఇచ్చిన ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేని కేసీఆర్ మనకు అవసరమా? వైఎస్సార్ సంక్షేమం కోసమే పార్టీ పెట్టాం. ఆశీర్వదించండి.. వైఎస్సార్ సంక్షేమ పాలన తిరిగి తీసుకొస్తా. ఆరోగ్య శ్రీ అమలు చేస్తాం.. వృద్ధులకు 3 వేలకు పైగా పెన్షన్ ఇస్తాం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీల సంక్షేమం కోసం కృషి చేస్తాం. మాట ఇస్తున్నాం.. వైఎస్సార్ సంక్షేమ పాలన తిరిగి తీసుకొస్తా’ అని షర్మిల వ్యాఖ్యానించారు.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.