యాప్నగరం

వనపర్తి: బైక్‌పై వెళ్తూ పందిని ఢీకొన్న బాలుడు.. రెండ్రోజుల తర్వాత విషాదం

గురుకుల పాఠశాలలో చదువుతున్న అన్నను అక్కడ వదిలిపెట్టేందుకు వెళ్లిన ముజాహిద్దీన్‌ తిరిగి వెళ్తూ పందిని ఢీకొట్టాడు. తలకు బలమైన గాయం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

Samayam Telugu 25 Feb 2021, 9:18 am

ప్రధానాంశాలు:

  • వనపర్తి జిల్లా అమరచింతలో విషాదం
  • బైక్‌పై వెళ్తూ పందిని ఢీకొన్న బాలుడు
  • రెండ్రోజుల తర్వాత ఆస్పత్రిలో మరణం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ముజాహిద్దీన్‌(ఫైల్ ఫోటో)
వలిమా విందుకు వచ్చిన అన్నను గురుకుల పాఠశాలలో వదిలి వస్తుండగా ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన వనపర్తి జిల్లాలో విషాదం నింపింది. బైక్‌పై వెళ్తూ పందిని ఢీకొట్టి గాయపడిన ముజాహిద్దీన్‌(14) చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పయాడు. అమరచింత పట్టణానికి చెందిన అమ్మాయికి కొత్తకోటకు చెందిన ఓ యువకుడితో ఆదివారం వివాహం జరిగింది. సోమవారం వరుడి ఇంటికి అమ్మాయి తరపు బంధువులు వలిమా విందుకు వెళ్లారు.
Also Read: హైదరాబాద్: ఇద్దరు అమ్మాయిలతో ఏకాంతసేవ.. అడ్డంగా బుక్కైన డాక్టర్, రూ.39లక్షల హుష్‌కాకి

వధువు బంధువుల కుటుంబానికి చెందిన సైఫ్, ముజాహిద్దీన్‌ అన్నదమ్ములు. సైఫ్ కొత్తకోటలోని కానాయపల్లి వద్ద ఉన్న తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు. విందు అనంతరం అన్న సైఫ్‌ను గురుకుల పాఠశాల వద్ద వదలడానికి ముజాహిద్దీన్‌ మరో బాలుడితో కలిసి బైక్‌పై వెళ్లాడు. సైఫ్‌ను వదిలి ఇద్దరూ ఇంటికి తిరిగి వస్తుండగా కానాయపల్లి స్జేజీ వద్ద పంది అడ్డంగా వచ్చింది. దీంతో బైక్ నడుపుతున్న ముజాహిద్దీన్‌ అదుపుతప్పి పందిని ఢీకొన్నాడు.

Also Read: జూబ్లీహిల్స్: అర్ధరాత్రి సెల్‌ఫోన్‌ లాక్కున్న దొంగ.. దిమ్మతిరిగే షాకిచ్చిన మహిళ, ఇలా ఊహించి ఉండరు

ఈ ప్రమాదంలో ముజాహిద్దీన్‌ తలకు బలమైన గాయం కాగా.. మరొకరు స్వల్పంగా గాయపడ్డారు. దీంతో స్థానికులు వారిద్దరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించంతో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున ముజాహిద్దీన్‌ చనిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.