యాప్నగరం

సెల్ ఫోన్ కోసం .. ప్రాణం తీసుకున్న 8వ తరగతి విద్యార్థి

8 వ తరగతి చదువుతున్న రెండో కుమారుడు తనకు సెల్ పోన్ కొనివ్వాలని తల్లిదండ్రుల్ని అడిగాడు. అయితే తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోలేదు. దీంతో వాళ్లు పొలం పనులకు వెళ్లగానే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Samayam Telugu 10 Jul 2021, 9:57 am
చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య ఈ మధ్యకాలంలో పెరిగిపోతుంది. తాజాగా ఓ విద్యార్థి సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దుర్ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. గూరకొండ గ్రామానికి చెందిన గడుగు చిట్టెమ్మ, లక్ష్మన్నకు ఇద్దరు కుమారులు. రెండవ కుమారుడు కురుమూర్తి (15) 8వ తరగతి చదువుతు న్నాడు. గురువారం రాత్రి సెల్‌ ఇప్పించమని తలిదండ్రులను అడుగగా వారు ఒప్పుకొలేదు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


దీంతో శుక్రవారం తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఎవరూ లేనిది చూసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద కుమారుడు గమనించి తల్లిదండ్రులకు చెప్పడంతో చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.