యాప్నగరం

Ayyappa Devotees: ఓయూ విద్యార్థి నాయకుడిని ఉరికిచ్చి కొట్టిన అయ్యప్ప భక్తులు

Ayyappa Devotees: హిందూ దేవుళ్లు, అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ ఓయూ విద్యార్థి నాయకుడు బైరి నరేశ్‌పై అయ్యప భక్తులు దాడి చేశారు. కోస్గి మండల కేంద్రంలో ఆయనను రోడ్డుపై పరిగెత్తించి కొట్టారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పోలీసులు అతడిని కాపాడగా.. అక్కడి నుంచి పరారయ్యాడు. మత విద్వేషాలు రెచ్చగొట్టిన నేరం కింద బైరి నరేశ్‌ పై పోలీసులు 4 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 30 Dec 2022, 4:43 pm

ప్రధానాంశాలు:

  • బైరి నరేశ్‌పై అయ్యప్ప స్వాముల దాడి
  • మతవిద్వేషాలు రెచ్చగొట్టాడంటూ ఆగ్రహం
  • అతడిపై కేసులు నమోదు చేసిన పోలీసులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu bairi naresh
బైరి నరేశ్‌పై దాడి
Ayyappa Devotees: కోస్గిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హిందూ దేవుళ్లు, అయ్యప్ప స్వామిపై ఓయూ విద్యార్థి సంఘం నాయకుడు బైరి నరేశ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కోస్గి మండల కేంద్రంలో అయ్యప్ప స్వాములు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన బైరి నరేశ్‌పై అయ్యప్ప స్వాములు దాడి చేశారు. ఆయన్ను రోడ్డుపై పరిగెత్తించుకుంటూ కొట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తవాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు.. అయ్యప్ప భక్తులను శాంతిపజేసే ప్రయత్నం చేశారు. అనంతరం అక్కడి నుంచి బైరి నరేశ్‌ కారులో పరారయ్యాడు.
ఏం జరిగిందంటే..
రెండు రోజుల కిందట కొడంగల్‌లో ఓ సభలో పాల్గొన్న బైరి నరేశ్.. హిందూ దేవుళ్లు, అయ్యప్ప స్వామిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు. అయ్యప్ప స్వామి పుట్టుకపై ఆయన అనుచితంగా మాట్లాడారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బైరి నరేశ్ వ్యాఖ్యలపై హిందూ సమాజం భగ్గుమంది. రాష్ట్రవ్యాప్తంగా ఆ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగించారు. యూట్యూబ్ ఛానల్‌ వేదికగా..తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంత వాతావరణాన్ని భైరి నరేష్‌ భగ్నం కలిగిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కుల మతాలను రెచ్చగొడుతూ ఉద్దేశపూర్వకంగా హిందూ మతాన్ని, దేవతలను అవమాన పరుస్తున్నాడని మండిపడ్డారు. అతడి యూట్యూబ్ ఛానల్‌పై నిషేదం విధించాలని డిమాండ్ చేసారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా నరేశ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఆయనపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించాలని డిమాండ్ చేశారు. తాను ఏ తప్పు చేయకోయినా ఈ ప్రభుత్వం జైలుకు పంపించిందని.., బైరి నరేశ్ బహిరంగంగా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడరని అతడిపై పీడీ యాక్ట్ పెట్టాలని సీఎం కేసీఆర్‌ను, కేటీఆర్‌ను డిమాండ్ చేశారు.

మరోవైపు బైరి నరేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 4 సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం నరేశ్ పరారీలో ఉండగా అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించబోమని వికారాబాద్ ఎస్పీ హెచ్చరించారు. మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. శాంతికి విఘాతం కలిగించే వారిని సభలు, సమావేశాలకు పిలవొద్దని ఎస్పీ సూచించారు. ప్రతి ఒక్కరూ మత సామరస్యంతో మెలగాలని సమాజంలో శాంతికి దోహదపడాలన్నారు. సున్నితమైన అంశాలపై వివాదస్పద వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఎస్పీ తేల్చి చెప్పారు.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.