యాప్నగరం

చెరువులో శవమై తేలిన బీటెక్ యువతి.. ఏమైంది?

ఉదయాన్నే మిని ట్యాంక్ బండ్‌కి వాకింగ్ వచ్చిన స్థానికులు షాక్‌కి గురయ్యారు యువతి శరీరం నీళ్లతో తేలుతూ కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కారణాలు తెలియాల్సి ఉంది.

Samayam Telugu 1 Dec 2021, 5:13 pm
చెరువులో యువతి శవమై తేలిన షాకింగ్ ఘటన మహబూబ్‌నగర్‌లో తీవ్ర కలకలం రేపింది. పట్టణంలోని మినీ ట్యాంక్‌బండ్ చెరువులో ఇరవై ఏళ్ల బీటెక్ విద్యార్థిని మృతదేహం లభ్యమైంది. ట్యాంక్ బండ్‌పై ఉదయం వాకింగ్ వచ్చిన వారికి విద్యార్థిని శవం తేలుతూ కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బోటులో వెళ్లి అతికష్టమ్మీద యువతి మృతదేహాన్ని బయటకు వెలికితీశారు. యువతిని సమీపంలోని భగీరథ కాలనీకి చెందిన కిషోర్ కుమార్ కూతురు(20)గా గుర్తించారు. ఆమె బీటెక్ చదువుతున్నట్లు సమాచారం. అనూహ్యంగా శవమై కనిపించడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఆమె మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Samayam Telugu చెరువులో మృతదేహం
mahabubnagar


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.