యాప్నగరం

Nagarkurnool: కన్న తల్లి పట్ల కూతురు కర్కషత్వం.. పెన్షన్ డబ్బుల కోసం విచక్షణారహితంగా దాడి

Nagarkurnool: ఈ సృష్టిలో అమ్మను మించిన దైవం లేదంటారు. నవమాసాలు మోసి కని పెంచిన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది అమ్మ. నిరంతరం తన బిడ్డల యోగక్షేమాలనే కోరుకుంటుంది. వారు ఉన్నత స్థాయికి ఎదిగితే ఉప్పొంగిపోతుంది. కానీ కొందరు కన్నవారి పట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా నాగర్ కర్నూలు జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. పెన్షన్ డబ్బు ఇవ్వలేదని కన్నతల్లిపై ఓ కుతూరు తన క్రూరత్వాన్ని ప్రదర్శించింది. వృద్ధురాలు అని కూడా చూడకుండా విచక్షణారహితంగా దాడి చేసింది.

Authored byసందీప్ పూల | Samayam Telugu 7 Dec 2022, 11:17 am

ప్రధానాంశాలు:

  • నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో అమానుషం
  • కన్నతల్లిని విచక్షణారహితంగా కొట్టిన కూతురు
  • పెన్షన్ డబ్బు కోసం దాష్టీకం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Daughter attacked mother
తల్లిపై కూతురు కర్కషత్వం
Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. మానవత్వం మరిచిన ఓ కూతురు తాగుడుకు బానిసై.. కనిపెంచిన కన్నతల్లి పట్ల కూర్రంగా ప్రవర్తించింది. తల్లిపై విచక్షణారహితంగా దాడి చేసింది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. చంద్రమ్మ (70) అనే వృద్ధురాలు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న తన కూతురు వద్ద ఉంటుంది. తాగాడుకు బానిసైన కూతురు ప్రభుత్వం ఇస్తున్న వృద్ధాప్య పెన్షన్ డబ్బులు తనకు ఇవ్వకపోవడంతో తల్లిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నడి బజారులో తల్లిపై విచక్షాణరహితంగా దాడి చేసింది. ఆవేశంతో ఊగిపోతూ వృద్ధురాలైన తల్లిని తీవ్రంగా కొట్టింది.
చంద్రమ్మ వద్ద నున్న పెన్షన్ డబ్బులతో పాటు ఆమె ఒంటిపై ఉన్న వెండి ఆభరణాలను లాక్కొంది. చుట్టుపక్కల వారు వద్దని వారిస్తే వారిని తీవ్ర పదజాలంతో దుర్భాషలాడింది. తిట్ల పురాణం అందుకుంది. వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేస్తామని కొందరు స్థానిక యువకులు హెచ్చరించినా ఆమె శాంతించలేదు. 'నా తల్లి, నాఇష్టం ఏమైనా చేసుకుంటా.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి' అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది. వృద్దురాలిపై దాడి చేసే ముందు ఆమె భర్త పక్కనే ఉన్నా... వద్దని వారించలేదు. నవమాసాలు కని పెంచి పోషించిన తల్లి పట్ల కూతురు వ్యవహరించిన తీరుపై స్థానికులు మండిపడుతున్నారు.

  • Read More Telangana News and Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.