యాప్నగరం

తండ్రి అంత్యక్రియలకు వస్తూ.. కూతురు అనంతలోకాలకు.. విషాదం

తండ్రి అంత్యక్రియలకు వస్తూ.. రోడ్డు ప్రమాదంలో కూతురు మృతి చెందిన విషాద ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. తండ్రీకూతురు మృతితో ఆ గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

Authored byAshok Krindinti | Samayam Telugu 12 May 2022, 4:57 pm
నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం చోటు చోటుచేసుకుంది. తండ్రి అంత్యక్రియలకు వస్తూ.. కూతురు రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. వివరాలు ఇలా.. పదర మండలంలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన కార్తీక్ రెడ్డి అనే వ్యక్తి మరణించగా.. ఆయన కూతురు అనురాధకు బంధువులు సమాచారం అందించారు. తన భర్తతో కలిసి తండ్రి అంత్యక్రియలకు ఆమె బైక్ వస్తుండగా.. ఇప్పపల్లి గ్రామ సమీపంలో గల పెట్రోల్ మలుపు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


వేగంగా వస్తున్న బస్‌ను చూసి అనురాధ భర్త బ్రేక్ వేశాడు. దీంతో బైక్ నుంచి ఎగిరి.. బస్సును అనురాధ తలంగా బలంగా తాకింది. తలకు బలమైన గాయాలు కావడంతో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనురాధ మరణవార్తతో ఇప్పలపల్లి గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. తండ్రి అంత్యక్రియలకు వస్తూ.. కూతురు మృతిచెందడం గ్రామస్తులను కలచివేసింది. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. రోడ్డు ప్రమాదంపై పోలీసులకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.