యాప్నగరం

పొంగులేటి ఆత్మీయ సమావేశానికి మాజీ మంత్రి.. సస్పెన్స్ వీడే అవకాశం!

Ponguleti Srinivas Reddy: తెలంగాణ పొలిటికల్ సర్కిల్‌లో కీలక పరిణామాం చోటు చేసుకుంది. గత కొంత కాలంగా అధికార బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీ మారునున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ మాజీ మంత్రి పొంగులేటి ఆత్మీయ సమావేశానికి జూపల్లి హాజరవుతున్నారు. ఆ సమావేశంలో ఆయన పార్టీ మార్పుపై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.

Authored byసందీప్ పూల | Samayam Telugu 9 Apr 2023, 12:06 pm

ప్రధానాంశాలు:

  • తెలంగాణలో పాలిటిక్స్‌లో కీలక పరిణామం
  • మాజీ ఎంపీతో మాజీ మంత్రి జూపల్లి సమావేశం
  • రాజకీయ భవితవ్యంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu jupally krishna rao
జూపల్లి కృష్ణారావు
Jupally Krishna Rao: తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయం వేడెక్కుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతుండగా.. నేతలు కూడా తమకు కలిసొచ్చే పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. సిట్టింగ్‌లకే సీట్లు ఇస్తామని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించటంతో ఆ పార్టీలో అసంతృప్త నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తమకు రాజకీయ భవిష్యత్తుపై ఓ అంచనాకు వచ్చి.. కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే ఖమ్మం జిల్లాలో కీలక నేతగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై యుద్ధాన్ని ప్రకటించారు. ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ.. దూకుడు పెంచారు. తన తరఫున అభ్యర్థులను ప్రకటిస్తూ.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా.. మరో బీఆర్ఎస్ అసమ్మతి నేత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక కామెంట్స్ చేశారు. గత కొంత కాలంగా పార్టీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్న ఆయన.. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ ఏర్పడిందో ఆ లక్ష్యసాధనలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. బీఆర్ఎస్‌లో ఉన్నానని తానెప్పుడు చెప్పలేదన్న జూపల్లి.. తాను పార్టీలో ఉన్నానో లేదో చెప్పాల్సింది పార్టీ నాయకత్వమేనని కీలక కామెంట్స్ చేశారు. పార్టీలో ఉంటానా, మారతానా అన్నది ప్రధానం కాదని అన్నారు.

జూపల్లి కామెంట్లతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పొంగులేటి తరహాలోనే జూపల్లి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఝలక్ ఇన్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరవుతున్నారు. హైదరాబాద్‌ శివారు తుక్కుగూడలో నుంచి కార్యకర్తలు, అభిమానులతో కలిసి ర్యాలీగా కొత్తగూడెం ప్రయాణమయ్యారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు, జరుగుతున్న ప్రచారాల గురించి కొత్తగూడెంలో మాట్లాడతానని ఇప్పటికే జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ అసెంబ్లీ నియోజవర్గానికి టీఆర్ఎస్ నుంచి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ నుంచి బీరం హర్షవర్ధన్ రెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో జూపల్లి కృష్ణారావు ఓడిపోగా... హర్షవర్ధన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అధికార పార్టీలో చేరారు. ఇక అప్పటి నుంచి జూపల్లి, హర్షవర్ధన్ కు అస్సలు పడడం లేదు. వాళ్లిద్దరూ ఒకే పార్టీలో ఉన్నా.. ఆధితప్య పోరు కొనసాగుతోంది.

జూపల్లి, హర్షవర్ధన్ రెడ్డిల మధ్య పంచాయతీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్లింది. చాలా సార్లు బహిరంగంగానే ఇద్దరు నేతలు విమర్శలు చేసుకున్నారు. ఈ క్రమంలో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు జూపల్లి దూరంగా ఉంటున్నారు. ఈ సారి సిట్టింగులకే టిక్కెట్లు ఇస్తానని కేసీఆర్ ప్రకటించడంతో.. జూపల్లిలో అసంతృప్తి ఇంకా పెరిగింది. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారుతారనే ప్రచారం కూడా సాగింది. అయినా ఇప్పటివరకూ ఆయన ఏ పార్టీలోనూ చేరలేదు. తాజాగా.. అధికార పార్టీపై విమర్శలు.. పొంగులేటి కార్యక్రమానికి హాజరు కానుడటం రాష్ట్ర రాజకీయాల్లో కీలక అంశంగా మారింది. పొంగులేటి సమావేశంలో ఆయన పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.