యాప్నగరం

పండ్లు ఫ్రీగా ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్ దారుణం, రైతుకి అవమానం.. సీన్‌లోకి ఎండీ సజ్జనార్!

కష్టపడి పండించిన పంటను పట్నం తీసుకెళ్దామంటే ఆర్టీసీ డ్రైవర్ రూపంలో అవాంతరం ఎదురైంది. తనకు పండ్లు ఫ్రీగా ఇస్తేనే తీసుకెళ్తానన్నాడు. ఉచితంగా ఇవ్వలేదని రైతుని నడిరోడ్డుపై వదిలేసి బస్సు పోనిచ్చాడు. చివరికి..

Samayam Telugu 28 Jan 2022, 11:04 pm

ప్రధానాంశాలు:

  • పంట పట్నం తీసుకెళ్లేందుకు సిద్ధమైన రైతు
  • పండ్లు ఉచితంగా ఇవ్వలేదని బస్సెక్కనివ్వని డ్రైవర్
  • ఎండీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లిన నెటిజన్లు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu బస్సు ముందు రైతు నిరసన
rtc bus
పండ్లు ఫ్రీగా ఇవ్వలేదని రైతుని డ్రైవర్ బస్సెక్కనివ్వని దారుణ ఘటన చోటుచేసుకుంది. అదే బస్సు తిరిగి ఊరికి రావడంతో పండ్ల బుట్టలు అడ్డుగా పెట్టి రైతు నిరసనకు దిగాడు. నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంలోని పెద్దకొత్తపల్లి మండలం మారేడుమాన్‌దిన్నె గ్రామానికి రైతు గోపయ్య తన పొలంలో బొప్పాయి పంట సాగు చేశాడు. పంటను సమీపంలోని కొల్లాపూర్ తీసుకెళ్లేందుకు ఊరికి వచ్చే ఆర్టీసీ బస్సే ఆధారం. రోజు మాదిరిగానే బస్సు వచ్చే వేళకి గోపయ్య పండ్ల బుట్టలు సిద్ధం చేసుకుని రోడ్డు మీదకు వచ్చాడు.
అయితే ఈరోజు ఆయనకి ఊహించని అనుభవం ఎదురైంది. బొప్పాయి పండ్లు ఇస్తేనే బస్సులో తీసుకెళ్తానని డ్రైవర్ తేల్చిచెప్పాడు. రైతు పండ్లు ఫ్రీగా ఇవ్వలేదని ఆయన్ను ఎక్కించుకోకుండానే బస్సును పోనిచ్చాడు. ఆవేదనకు గురైన రైతు బస్సు తిరిగి గ్రామానికి వచ్చే సమయంలో పండ్ల బుట్టలు అడ్డుగా పెట్టి నిరసన తెలిపాడు. గంటపాటు బస్సును నిలిపివేసి నిరసన తెలియజేశాడు. ఈ ఘటన కెమెరా కంటికి చిక్కడంతో ఫొటోతో సహా ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌కి చేరింది. నెటిజన్లు ఫొటోను షేర్ చేసి ఆర్టీసీ ఎండీ ట్వీట్ చేయడంతో వెంటనే ఆయన కార్యాలయం స్పందించింది. వివరాలు తెలుసుకుని విచారణ జరుపుతామని బదులిచ్చారు.

tsrtc



Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.