యాప్నగరం

కాపురానికి రావడం లేదని నిప్పు పెట్టుకున్న భర్త.. కాపాడిన భార్య.. షాకింగ్ ఘటన

భర్తతో గొడపడిన భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. కాపురానికి రానంటూ నిరాకరించడంతో మనస్థాపానికి గురైన భర్త అఘాయిత్యానికి ఒడిగట్టాడు. చివరికి..

Samayam Telugu 28 Nov 2021, 10:17 pm
భార్య కాపురానికి రావడంలేదని మనస్థానికి గురై పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడో భర్త. మంటల్లో కాలిపోతున్న భర్త కేకలు విని పరుగెత్తుకొచ్చిన భార్య స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించిన షాకింగ్ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. మహబూబ్‌‌నగర్‌ పట్టణంలోని సంజయ్ నగర్‌కి చెందిన బండి కార్తీక్‌(22)కి పాతపాలమూరుకి చెందిన రాజేశ్వరితో మూడేళ్ల కిందట వివాహం జరిగింది. ఇటీవల భార్యాభర్తల నడుమ గొడవ జరగడంతో రాజేశ్వరి తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో భార్యను ఇంటికి తిరిగి తీసుకొచ్చేందుకు కార్తీక్ అత్తారింటికి వెళ్లాడు. కాపురానికి వచ్చేందుకు భార్య నిరాకరించడంతో తీవ్ర మనస్థానికి గురైన కార్తీక్ అమాంతం ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో కలకలం రేగింది. మంటల్లో కాలిపోతూ కార్తీక్ కేకలు వేయడంతో భార్య స్ధానికులతో కలసి అతన్ని ఆస్పత్రికి తరలించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
marriage


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.