యాప్నగరం

జడ్చర్ల వాసికి రాష్ట్రపతి ఫోన్ కాల్.. ఆశ్చర్యం!! ఆ విషయం చెప్పేందుకు చేశారట!

దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఓ అతి సామాన్యుడికి ఫోన్ చేశారు. మీరు పంపిన ఆహ్వానం అందిందని.. బిజీ షెడ్యూల్ కారణంగా రాలేకపోతున్నానని సమాధానం ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేసింది.

Samayam Telugu 12 Sep 2021, 9:48 pm
ఓ అతి సామాన్యుడికి దేశ ప్రథమ పౌరుడు ఫోన్ చేసి మరీ సమాధానం చెప్పిన ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణానికి చెందిన సోషల్ యాక్టివిస్ట్ అనిల్ కుమార్‌కి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. మీరు పంపిన ఆహ్వానం అందిందని.. బిజీ షెడ్యూల్ కారణంగా రాలేకపోతున్నానంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సమాధానమిచ్చారని అనిల్ తెలిపారు. తనకు రాష్ట్రపతి ఫోన్ చేసి మరీ సమాధానం చెప్పడం మరచిపోలేనని అంటున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
kovind


పట్టణంలోని గాంధీ ట్రస్టులో వచ్చే నెల 2వ తేదీన మహాత్ముడి విగ్రహావిష్కరణకు రావాలని కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకి అనిల్ ఆహ్వానం పంపించారు. అందుకు స్పందించిన రాష్ట్రపతి ఈ రోజు ఉదయం ఫోన్ చేశారని.. తన బిజీ షెడ్యూల్ కారణంగా రాలేకపోతున్నానని సమాధానం చెప్పారని ఆయన అన్నారు. ఒక్కసారి మిమ్మల్ని కలిసే అవకాశం ఇవ్వాలని కోరానని.. త్వరలోనే సమాచారం ఇస్తామని ఆయన చెప్పారని అనిల్ తెలియజేశారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.