యాప్నగరం

రాజకీయం చెండాలం, టీఆర్‌ఎస్‌ శాశ్వతం కాదు.! సీనియర్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి లక్ష్మా రెడ్డి మరోమారు షాకింగ్ కామెంట్స్ చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. టీఆర్‌ఎస్‌కి కూడా అది వర్తిస్తుందంటూ సొంత పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి.

Samayam Telugu 15 Sep 2021, 10:02 pm
ఆర్నెల్లు దిగిపోతాం.. అందరికీ ఉద్యోగాలిచ్చేయండంటూ ఇటీవల ప్రతిపక్షాలకు సవాల్ విసిరి సంచలనం రేపిన మాజీ మంత్రి, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుత రాజకీయాలపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. రాజకీయాలు చెండాలంగా తయారయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్వార్థం కోసం తొండి, అబద్ధాలు మాట్లాడుతున్నారని.. బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
laxma reddy


అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. టీఆర్‌ఎస్ పార్టీకి శాశ్వతమేం కాదంటూ లక్ష్మా రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో పాలించిన కాంగ్రెస్ పార్టీ కూడా శాశ్వతంగా ఏమీ అధికారంలో లేదని.. అంతకుముందున్న పార్టీలు కూడా లేవని ఆయన అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా బాధ్యతగా ఉండాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా ప్రతిపక్ష పాత్ర సమర్థంగా పోషించాలన్నారు. ప్రభుత్వం ఏం చేసినా తప్పు అనేలా ఉండకూడదని లక్ష్మా రెడ్డి హితవు పలికారు. ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ప్రజలు గందరగోళానికి గురవకుండా ఉపాధ్యాయులే చైతన్యం తీసుకురావాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.