యాప్నగరం

పెళ్లయినా.. మరో అమ్మాయితో యువకుడి ప్రేమాయణం.. చివరికి దారుణం

Wanaparthy : వనపర్తి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.. ఓ ప్రేమ జంట గుడిపల్లి ఎత్తిపోతల సిస్టర్న్‌లోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో గాలింపు చర్యలు చేపట్టారు..

Samayam Telugu 20 Jan 2022, 6:25 pm
వనపర్తి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.. రేవల్లి మండలం గుడిపల్లి ఎత్తిపోతల సిస్టర్న్‌లో దూకి ఓ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు గజఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


వివరాల్లోకి వెళ్తే.. నాగర్‌కర్నూల్‌లో చెందిన నరేశ్‌కు ఏడాదిన్నర కిందే వివాహమైంది. అతడికి భార్య, పాప ఉన్నారు. అయినా కూడా నరేశ్ మరో అమ్మాయిని ప్రేమించాడు. ఈ క్రమంలోనే ఆ అమ్మాయితో కలసి నరేశ్ సూసైడ్ చేసుకునేందుకు నదిలోకి దూకినట్లు తెలిసింది. కాగా నరేశ్ ప్రియురాలిది కల్వకుర్తి అని సమాచారం.

ఇక ప్రేమ జంట నదిలో దొరికినట్లుగా సమాచారం రావడంతో వెంటనే రేవల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటనా స్థలంలోని సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.