యాప్నగరం

కనిపించని అన్న, పట్టించుకోని వదిన.. బాత్రూమ్‌లో బయటపడ్డ నిజం

తమకు ఇల్లు నిర్మించి ఇచ్చి ఆదరించిన అన్న అనూహ్యంగా అదృశ్యమయ్యాడు. రెండునెలలైనా ఆచూకీ లేకపోవడంతో ఆడపడుచుకి అనుమానం వచ్చింది. వదిన బండారం బయటపడింది.

Samayam Telugu 2 Sep 2021, 6:31 pm
తమ కోసం ఆస్తి అమ్మి మరీ ఇల్లు కట్టించి ఇచ్చిన అన్న అనూహ్యంగా కనిపించకుండా పోయాడు. వదిన తనకేమీ తెలియదన్నట్టు పట్టించుకోవడం లేదు. రెండు నెలలైనా మనిషి ఆచూకీ లేకపోవడమేంటని ఆడపడుచుకు అనుమానం రావడంతో దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాత్రూమ్‌లో భయంకరమైన నిజం బయటపడింది. కనిపించకుండా పోయిన అన్న శవమై.. ఎముకల గూడుగా తన ఇంటి బాత్రూమ్‌ కిందే కనిపించడంతో వదిన బండారం బయటపడింది. ఈ అత్యంత దారుణ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో వెలుగుచూసింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
bathroom


జిల్లాలోని నవాబుపేట మండలం దర్పల్లి పంచాయతీ పరిధిలోని చిన్నంబావి గ్రామానికి చెందిన చిన్నయ్య(45), రాములమ్మ దంపతులు. ఇటీవల తనకున్న కొద్దిపాటి ఆస్తిని అమ్మేసిన చిన్నయ్య ఓ ఇల్లు నిర్మించాడు. ఆ ఇంటిని తన తోడబుట్టిన చెల్లెళ్లకి ఇవ్వడంతో భార్య రాములమ్మతో గొడవలు మొదలయ్యాయి. ఆడపడుచులకు ఆస్తి ఇవ్వడం జీర్ణించుకోలేకపోయిన రాములమ్మ ఘాతుకానికి తెగబడింది. కట్టుకున్న భర్తని అమానుషంగా అంతం చేసింది.

రెండు నెలలైనా అన్న ఆచూకీ తెలియకపోవడంతో చెల్లెలికి అనుమానం కలిగింది. తన అన్న కనిపించడం లేదంటూ ఆమె పోలీసులను ఆశ్రయించడంతో వదిన ఘాతుకం వెలుగుచూసింది. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు రాములమ్మని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. తన భర్తను హత్య చేసి బాత్రూమ్ కింద పూడ్చిపెట్టినట్లు చెప్పడంతో పోలీసులే అవాక్కయ్యారు. ఆమె చెప్పిన వివరాల మేరకు బాత్రూమ్ పగలగొట్టి కింద ఉన్న చిన్నయ్య శవాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.