యాప్నగరం

కూతురికి పిండం పెట్టిన కసాయి తండ్రి.. బతికుండగానే.! దారుణం

బతికున్న కూతురికి ఓ తండ్రి పిండం పెట్టిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రేమను ఇరుకుటుంబాల పెద్దలు అంగీకరించకపోవడంతో భార్గవి, వెంకటేష్ పెళ్లి చేసుకున్నారు. కూతురి వివాహాన్ని భరించలేని తండ్రి..

Samayam Telugu 17 Jan 2022, 6:16 pm
కన్నకూతురు బతికుండగానే పిండం పెట్టాడో కసాయి తండ్రి. తమకు ఇష్టం లేని వివాహం చేసుకుందన్న కోపంతో దారుణానికి పాల్పడ్డాడు. గుండు గీయించుకుని.. దినకర్మలు నిర్వహించడమే కాకుండా ఆమెకు పిండప్రదానం చేశాడు. కూతురు పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకోవడమే కారణంగా తెలుస్తోంది. ప్రేమ వివాహం నచ్చని తండ్రి ఈ అమానుష చర్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ దారుణ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో వెలుగుచూసింది.
Samayam Telugu శ్రద్ధాంజలి ఘటిస్తున్న తండ్రి
father


జిల్లాలోని చిన్న చింతకుంట మండలం మద్దూరు గ్రామానికి చెందిన భార్గవి అదే గ్రామానికి చెందని వెంకటేష్ అనే యువకుడిని ప్రేమించింది. ఇద్దరూ సమీప బంధువులే కావడంతో పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలనుకున్న జంట పెద్దలను ఆశ్రయించారు. తాము ప్రేమించుకున్నామని.. పెళ్లి చేయాలని కోరారు. అందుకు పెద్దలు ససేమిరా ఒప్పుకోకపోవడంతో ఈ నెల 13న గుడిలో పెళ్లి చేసుకున్నారు. పెద్దలను ఎదిరించి వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

తమను కాదని ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుందని భార్గవి తండ్రి కోపంతో రగిలిపోయాడు. తన కూతురితో తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఆమె ఇప్పటితో చనిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతటితో ఆగని ఆయన తన కూతురు చనిపోయిందంటూ గుండు గీయించుకుని ఆమెకు కర్మకాండలు జరిపించాడు. కూతురి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కూతురి ప్రేమ వివాహాన్ని భరించలేక తండ్రి చేసిన పని గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.

love couple



Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.