యాప్నగరం

మహిళా కార్యకర్త దీనస్థితికి చలించిపోయి.. పెద్ద మనసు చాటుకున్న మంత్రి

పార్టీలో కార్యకర్తలు ఎలా ఉన్నారు.. వాళ్ల పరిస్థితి ఏంటనేది.. పైస్థాయి నాయకులు అంతగా పట్టించుకోలేరు. అందుకు కారణం వాళ్లకున్న పరిమితులు కావచ్చు.. లేదా పరిస్థితులు కావచ్చు.. క్షేత్రస్థాయి కార్యకర్తల బాధలు వినేంత సమయం కానీ.. సందర్భం కానీ బడా నాయకులకు ఉండకపోవచ్చు. అయితే.. ఇక్కడ ఓ సాధారణ కార్యకర్త పరిస్థితిని తెలుసుకుని చలించిపోయిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. తన పెద్ద మనసు చాటుకున్నారు. ఆ కార్యకర్త కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 25 Mar 2023, 11:42 pm

ప్రధానాంశాలు:

  • సాధారణ కార్యకర్త దీన స్థితికి చలించిపోయిన మంత్రి
  • కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటానని హామీ
  • కుటుంబంతో కలిసి భోజనం చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu srinivas goud
శ్రీనివాస్ గౌడ్
ఏదైనా రాజకీయ పార్టీలో గుర్తింపు రావాలంటే.. ఒకటి బ్యాగ్రౌండ్ ఉండాలి.. లేదా బలినోళ్లు అయి ఉండాలి.. మరీ అంటే పాపులర్ వ్యక్తి అయి ఉండాలి.. ఇవేవి లేవంటే.. కష్టపడుతూ ఏదో ఒక రోజు అవకాశం రాకపోదా.. గుర్తింపు దక్కకపోదా అని ఎదురుచూస్తూ ఉండాలి. అలాంటి కార్యకర్తలు ఎందరో పార్టీలను నమ్ముకుని తమ జీవితాన్ని ధారపోస్తున్నారు. వాళ్లు తమ కుటుంబ పరిస్థితిని పక్కనబెట్టి మరీ.. పార్టీల కోసం పని చేస్తుంటారు. రూపాయి ఆదాయం లేకున్నా.. ఎప్పటికైనా సరైన గుర్తింపు వస్తుందని చెమట చిందిస్తుంటారు. అలాంటి ఓ కార్యకర్త దీన సిత్థి గురించి తెలిసి తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చలించిపోయారు. అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అంతేనా.. ఆ కుటుంబంతో కలిసి భోజనం చేశారు. ఈ ఘటనతో పార్టీ కార్యకర్తలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎంతటి ప్రాధాన్యమిస్తారో మరోసారి నిరూపితమైంది.
శనివారం రోజు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పట్టణంలోని బంజారా కాలనీకి చెందిన ఇందిర అనే కార్యకర్త సమావేశంలో పాల్గొంది. అయితే.. ఈ సభలో ప్రసంగించిన ఇందిర.. తన ఆర్థిక పరిస్థితి గురించి మంత్రి దృష్టికి తీసుకువచ్చింది. ఆమె ఆర్థిక పరిస్థితికి చలించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. వారికి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కుటుంబానికి తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు. సమావేశం అనంతరం ఇందిరతో పాటు ఆమె కూతురు, కొడుకుతో కలిసి భోజనం చేశారు. తానే స్వయంగా వారికి భోజనం వడ్డించారు. ఓ సాధారణ కార్యకర్త అయిన తన ఆవేదనను సాక్షాత్తు మంత్రి ఇంత ఓపికగా విని ఎంతో భరోసాను ఇచ్చినందుకు ఇందిర ఆనందభాష్పాలతో కృతజ్ఞతలు తెలిపారు.




  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.