యాప్నగరం

Srinivas Goud: రేవంత్‌కు కుల పిచ్చి.. అసలు బండి సంజయ్ ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు: శ్రీనివాస్ గౌడ్

ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. జనాల్ని కులం, మతం పేరుతో రెచ్చగొడుతూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డికి కుల పిచ్చి ఉంటే బీజేపీకి మత పిచ్చి అంటూ మండిపడ్డారు.

Authored byRaj Kumar | Samayam Telugu 6 Jun 2022, 3:14 pm
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. జనాల్ని కులం, మతం పేరుతో రెచ్చగొడుతూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డికి కులం పిచ్చి ఉంటే బీజేపీకి మతం పిచ్చి ఉందంటూ సెటైర్లు వేశారు. రెండు జాతీయ పార్టీల నాయకులకు దెయ్యం పట్టినట్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ ఒక్కనాడు వాళ్ల కులం వాళ్లకు ఏమీ చేయని నేత అని నిప్పులు చెరిగారు. అసలు ఎవరి ఓట్లతో ప్రజా ప్రతినిధిగా గెలిచావంటూ ప్రశ్నించారు.
Samayam Telugu మంత్రి శ్రీనివాస్ గౌడ్


ఇక బండి సంజయ్ ఏం మాట్లాడుతాడో ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. కనీసం ఆయనకు కూడా అది తెలియదని.. కేవలం సీఎం కేసీఆర్‌ను తిట్టుకుంటూ తిరగడం తప్ప చేసిందేమీ లేదని శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను గుజరాత్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారని మండిప‌డ్డారు. పాలమూరు స్టేడియం గ్రౌండ్‌లో 40 లక్షల అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమైక్యాంధ్రాలో నారాయణపేట అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. తెలంగాణ వచ్చాక పూర్వ వైభవం తెస్తున్నామ‌ని.. జిల్లా కేంద్రంగా మార్చామ‌ని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణలో ఏ అభివృద్ధి పని జరుగుతున్నా.. ఇక్కడ నారాయణపేట నుంచే మొదలు పెడుతున్నామన్నారు. ఇప్పుడు జిల్లా ఆస్పత్రి.. త్వరలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. ఇంతటి అభివృద్ధి పనులు జరుగుతుంటే బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.