యాప్నగరం

ఆసుపత్రికి వస్తుండగా.. కారు, ప్రొక్లెయిన్ ఢీ: తల్లీకుమారుడు మృతి

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో కారు, ప్రొక్లెయిన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడగా.. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Authored byAshok Krindinti | Samayam Telugu 17 May 2022, 7:41 pm

ప్రధానాంశాలు:

  • జడ్చర్ల వద్ద కారు, ప్రొక్లెయిన్ ఢీ..
  • తల్లీకుమారుడు అక్కడిక్కడే మృతి
  • తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ప్రమాదం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu జడ్చర్ల ప్రమాదం
మహబూబ్ నగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకుమారుడు మృతిచెందారు. జడ్చర్ల సమీపంలో కారు, ప్రొక్లెయిన్ ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా..
కోయిలకొండకు చెందిన బి.ప్రమీల అనే మహిళ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులు స్థానికంగా చికిత్స చేయించినా.. ఆరోగ్యం కుదుటపడలేదు. దీంతో మెరుగైన వైద్యం చేయించేందుకు హైదరాబాద్‌కు వెళ్లేందుకు ఆమె చిన్న కుమారుడు యాదయ్య, కుమార్తె, పెద్ద కోడలు అందరూ కలిసి కారులో బయలుదేరారు. కారు జడ్చర్ల సమీపంలోకి వచ్చిన సమయంలో.. ప్రొక్లెయిన్‌, కారు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రమీల, యాదయ్య ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.

కారు డ్రైవర్‌ శివకుమార్‌కు తీవ్రగాయలు కాగా.. మిగిలిన ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తల్లీకొడుకుల మృతితో కోయిలకొండలో తీవ్రవిషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.