యాప్నగరం

పెళ్లైన రెండు నెలలకే విషాదం.. యువకుడు ఆత్మహత్య

రవికు రెండు నెలల క్రితమే వివాహం జరిగింది. అయితే ఆర్థిక సమస్యల కారణంగానే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.ఈ విషయమై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందకపోవడం గమనార్హం .

Samayam Telugu 2 Aug 2021, 7:54 am
పెళ్లైన రెండు నెలలకే కొత్త పెళ్లికొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉరివేసుకొని యువకుడు ప్రాణం తీసుకున్నాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా ఉండవల్లిలో ఆది వారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివారాలు ప్రకారం.. మండలకేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన దాసు ఆలియాస్‌ రవికు మార్‌(29) వృత్తిరీత్యా సెంట్రింగ్‌ కార్మికుడిగా పని చేసేవాడు. రెండు నెలల క్రితం రవికి ఇటిక్యాల మండలం ఆర్‌ గార్లపాడు గ్రామానికి చెందిన యువతితో వివాహం అయింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


అయితే పెళ్లి అనంతరం రవికి ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో అతడు ఆందోళనకు గురయ్యాడు. ఆర్థిక సమస్యల కారణంగా ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈ విషయంపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.