యాప్నగరం

NHAI: తెలుగు రాష్ట్రాల మధ్య 4 లైన్ నేషనల్ హైవే.. ఈ ప్రాంతాల గుండా నిర్మాణం

National Highway: ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ మధ్య మరో జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య 255 కి.మీ మేర నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మించేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ నుంచి ఆమోదం లభించింది. రూ. 4,706 కోట్ల అంచనా వ్యయంతో తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నుంచి ఏపీలోని వైఎస్సాఆర్ జిల్లా జమ్మల మడుగు వరకు ఈ రహదారిని నిర్మించనున్నారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 19 Dec 2022, 9:01 am

ప్రధానాంశాలు:

  • తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్
  • రెండు రాష్ట్రాలను కలుపుతూ మరో జాతీయ రహదారి
  • ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu national highway
నేషనల్ హైవే
National Highway 167K: ఏపీ, తెలంగాణ వాసులకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రెండు రాష్ట్రాలను అనుసంధానిస్తూ.. మరో జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. రూ. 4,706 కోట్ల అంచనా వ్యయంతో ఈ రహదారిని నిర్మించేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నుంచి ఏపీలోని వైఎస్సాఆర్ జిల్లా జమ్మలమడుగు వరకు 255 కి.మీ మేర ఈ రహదారిని నిర్మించ తలపెట్టారు. నాలుగు వరుసలుగా నిర్మించనున్న ఈ రహదారికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ నుంచి ఆమోదం లభించింది.
రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ నిర్మించే ఈ రహదారి (NH 167K)ని ఏడు ప్యాకేజీల కింద నిర్మించనున్నారు. మెుత్తం 255 కిలో మీటర్లలో తెలంగాణలో 91 కి.మీ. నిర్మించనున్నారు. అందు కోసం రూ.2,406 కోట్ల వ్యయంతో డీపీఆర్ సిద్ధం చేశారు. మొదటి ప్యాకేజీ కింద రూ.886.69 కోట్లు, రెండో ప్యాకేజీ కింద రూ.1,082.40 కోట్లు, మూడో ప్యాకేజీ కింద రూ.436.91 కోట్లతో రహదారి నిర్మాణ పనులు చేపట్టేందుకు NHAI టెండర్ల ప్రక్రియను చేపట్టింది.

ఆంధ్రప్రదేశ్‌లో రూ.2,300 కోట్ల అంచనా వ్యయంతో 164 కి.మీ. మేర రహదారిని నిర్మించనున్నారు. ఏపీలో మొత్తం నాలుగు ప్యాకేజీల రహదారిని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. నంద్యాల జిల్లా సిద్ధేశ్వరం నుంచి వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు వరకు ఈ రహదారిని నిర్మిస్తారు. మొదటి ప్యాకేజి కింద 62.57 కి.మీ. మేర రహదారి నిర్మాణానికి రూ.785 కోట్లతో రహదారి పనులకు డీపీఆర్‌ను సిద్ధం చేశారు. రూ.1,515 కోట్ల అంచనా వ్యయంతో మిగిలిన మూడు ప్యాకేజీల కింద పనులను పూర్తి చేసేందుకు NHAI డీపీఆర్‌ను రూపొందిస్తోంది. మెుత్తం నాలుగు ప్యాకేజీల డీపీఆర్‌లు ఖరారయ్యాక 2023 ఫిబ్రవరి మొదటి వారంలో టెండర్ల ప్రక్రియ చేపట్టి ఏడాదిన్నర లో నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ ప్రణాళికలు రూపొందిస్తోంది.

రహదారిలో అంతర్భాగంగా ఇప్పటికే కృష్ణా నదిపై వంతెన నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏఐ టెండర్ల ప్రక్రియ చేపట్టింది. కాగా, ఏపీ - తెలంగాణ రాష్ట్రాలను అనుసంధానిస్తూ నాలుగు వరుసల రహదారి నిర్మాణ ప్రక్రియకు తాజాగా ఆమోదం తెలిపింది. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణం మరింత సులభం కానుంది. దాంతో పాటు రహదారి వెంట అభివృద్ధి జరిగి పెట్టుబడులకు, నూతన పరిశ్రమల రాకకు అవకాశం ఏర్పడనుంది.

Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.