యాప్నగరం

కొండ మలుపులో అదుపుతప్పిన కారు.. శుభకార్యానికొచ్చి.. విషాదం

శుభకార్యానికి వచ్చిన కుటుంబంలో అంతులేని విషాదం నెలకొంది. దైవదర్శనం కోసం భార్యతో కలసి వెళ్లిన భర్త తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.

Samayam Telugu 22 Jan 2021, 5:37 pm
బంధువుల ఇంట శుభకార్యానికి వెళ్లిన భార్యాభర్తలు బంధుమిత్రులతో ఆనందంగా గడిపారు. మరుసటి రోజు ఊరికి సమీపంలో కొండపై కొలువున్న వేంకటేశుడిని దర్శించుకుందామని వెళ్లారు. దైవాన్ని దర్శించుకుని తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పి పెద్ద గుంతలోకి పడిపోవడంతో భర్త ప్రాణాలు కోల్పోయాడు. భార్య సహా బంధువులు తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ అత్యంత విషాద ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
ghat road


మహబూబ్‌నగర్‌లోని బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండడంతో హైదరాబాద్‌లోని మేడ్చల్‌‌‌కి చెందిన శ్రీనివాసరెడ్డి, భార్య రమ, సమీప బంధువులైన శశికళ, మీన, కావ్య, అక్షయ తదితరులతో కలసి కారులో వచ్చారు. ఆ రోజు రాత్రి శుభకార్యంలో పాల్గొని బంధుమిత్రులతో సంతోషంగా గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం పట్టణానికి సమీపంలోని మన్యంకొండ వెంకన్న దర్శనానికి వెళ్లారు. దర్శనానంతరం కారులో తిరిగి బయలుదేరగా కొండ మలుపు వద్ద కారు అదుపుతప్పి చిన్నపాటి లోయలో పడిపోయింది.

ఈ ఘటనలో శ్రీనివారెడ్డి సహా కారులో ఉన్న అందరికీ తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా శ్రీనివాసరెడ్డి మార్గం మధ్యలో ప్రాణాలు విడిచాడు. ఆయన భార్య, బంధువులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుడు శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.