యాప్నగరం

వనపర్తిలో రక్షాబంధన్.. మంత్రి సింగిరెడ్డి కీలక కామెంట్స్..!

Singireddy Niranjan Reddy: వనపర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు, మహిళా ప్రజా ప్రతినిధులు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజంలోని కొంతమంది ఆలోచనాపరులు మిగతా వారిని ప్రభావితం చేస్తుంటారని వ్యాఖ్యానించారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 12 Aug 2022, 8:15 pm

ప్రధానాంశాలు:

  • వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాఖీ పండుగ
  • మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి రాఖీలు కట్టిన మహిళలు
  • మహిళలు అనేక రంగాల్లో పురోగమిస్తున్నారన్న సింగిరెడ్డి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Women offering rakhis to the minister
మంత్రికి రాఖీలు కడుతున్న మహిళలు
Singireddy Niranjan Reddy: తెలంగాణలో మహిళలు అన్ని రంగాల్లో పురోగమిస్తున్నారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు. వ్యవసాయం, విద్యా, ఉపాధి రంగాల్లో రాణిస్తున్నారని చెప్పారు. మహిళల శక్తిని ఎంత సద్వినియోగపరుచుకుంటే.. సమాజం అంత పురోగమిస్తుందని వివరించారు. వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రక్షాబంధన్ (Rakshabandhan) వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళా నేతలు మంత్రికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా నిరజంన్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో సుపరిపాలన సాగుతోందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. అన్ని వర్గాలకు సామాజిక, సాంఘీక, అర్థిక భద్రత ఉందని వ్యాఖ్యానించారు. రక్షాబంధన్ అన్నాచెల్లెల్ల అనుబంధం మాత్రమే కాదు.. సమాజంలో ఉన్న ప్రతి మహిళను, ప్రతి శిశువును గౌరవించడమేనని స్పష్టం చేశారు. దాన్ని కొనసాగించడమే మహిళలను సంతోషపెట్టడం అని చెప్పారు. సమాజంలోని కొంతమంది ఆలోచనాపరులు మిగతా వారిని ప్రభావితం చేస్తుంటారని కామెంట్ చేశారు.

కుటుంబంలోనే కాకుండా సమాజంలో ఎలాంటి వివక్ష, దాడి, విద్వేషం, అమానుషాలు లేకుండా మహిళలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలిగే సమాజమే నిజమైన సమాజమని మంత్రి సింగిరెడ్డి (Singireddy Niranjan Reddy) వ్యాఖ్యానించారు. ఆ దిశగా సమాజంలో మేల్కొలుపు రావాలన్నారు. ప్రత్యేకించి ప్రస్తుత తరం తమ కుటుంబంలో చెల్లిని, తల్లిని గౌరవించినట్లే సమాజంలోని ఇతర మహిళలను గౌరవించే సంస్కారం అలవర్చుకోవాలని సూచించారు. ఈ మధ్యకాలంలో అది కొరవడిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. దాని మూలంగా వస్తున్న దుష్పరిణామాలను చూస్తున్నామని వ్యాఖ్యానించారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.