యాప్నగరం

మహబూబ్‌నగర్‌లో మంత్రులకు షాక్.. ఆందోళనకు దిగిన సర్పంచ్‌లు

పంచాయతీరాజ్ సమ్మేళనంలో సర్పంచ్‌లు పంచాయితీకి దిగారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆందోళన బాట పట్టారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు.

Samayam Telugu 23 Jan 2021, 5:09 pm
మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రులకు చేదు అనుభవం ఎదురైంది. పంచాయతీరాజ్ సమ్మేళనానికి వచ్చిన జిల్లాలోని సర్పంచ్‌లు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమ సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ప్రజాప్రతినిధులే ఆందోళనకు దిగారు. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ఆందోళన చేశారు. నేలపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో సమ్మేళనానికి హాజరైన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి సర్పంచ్‌లకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నేరుగా సర్పంచ్‌ల వద్దకు వెళ్లి చర్చించారు. ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేసినా సర్పంచ్‌లు వెనక్కి తగ్గలేదు. దీంతో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. డిమాండ్లు నెరవేరుస్తామని హామీ ఇస్తేనే సమావేశంలో పాల్గొంటామని తేల్చి చెప్పారు. చివరికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హామీ మేరకు కొందరు సర్పంచ్‌లు మాత్రమే సమ్మేళనంలో పాల్గొన్నారు.
Samayam Telugu ఆందోళన చేస్తున్న సర్పంచులు
mahabubnagar


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.