యాప్నగరం

కొడుకు ప్రేమ పెళ్లి.. తల్లికి నచ్చక కోడలికి వేధింపులు.. చివరకు ఏమైందంటే

శివ మద్యం తాగి ఇంటికి వచ్చాడు. అప్పటికే ఇంట్లో రచ్చ మొదలయ్యింది. ఓ వైపు తల్లి మరో వైపు భార్య గొడవపడటం మొదలు పెట్టారు. దీంతో మద్యం మత్తులో ఉన్న శివ తల్లి మాటలు తట్టుకోలేక ఆవేవంతో ఆమెపై గొడ్డలితో దాడి చేశాడు.

Samayam Telugu 17 Apr 2021, 12:38 pm

ప్రధానాంశాలు:

  • ప్రేమ పెళ్లి చేసుకున్న కొడుకు
  • తల్లికి నచ్చక కోడలితో గొడవలు
  • ఆవేశంతో తల్లిని నరికిన కొడుకు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu తల్లిని చంపిన కొడుకు
కుటుంబం అన్నాక గొడవలు సాధారణం. భార్యాభర్తల మధ్య, తల్లీకొడుకుల మధ్య, అత్తాకోడళ్ల మధ్య ఏవో ఒక రుసరుసలు ఉంటూనే ఉంటాయి. అయితే అత్తాకోడలి గొడవతో విసిగిపోయిన ఓ వ్యక్తి కన్నతల్లినే దారుణంగా చంపేశాడు. ఈ ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ విషాదకర ఘటన వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం పోలికేపాడు గ్రామంలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పోలికేపాడు గ్రామంలో తల్లి మంకిలి కషమ్మ నివాసముంటున్నది. కొడుకు మంకిలి శివ (23),జేసీబీ నడుపుతూ జీవనం సాగించేవారు. అయితే ఇటీవల శివ ప్రేమ వివాహం చేసుకున్నాడు. శివ ప్రేమ వివాహం చేసుకున్నాడు. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని తరచూ ఇంట్లో గొడవలు జరిగేవి. చీటికి మాటికి అత్తకొడళ్లు గొడవలు పెట్టుకునేవారు. ఇదే క్రమంలో శుక్రవారం రాత్రి సుమారు 6 నుండి 7 గంటల మధ్య శివ పని ముగించుకొని ఇంటికి వచ్చాడు.

అతను రావడంతోనే అత్త కోడళ్ళ మధ్య గొడవ మాట మాట పెరిగింది. దీంతో అప్పటికే శివ మద్యం సేవించి ఉన్నాడు. దీంతో తల్లి మాటలకు ఆవేశం తట్టుకోలేని శివ గొడ్డలి తో మెడపై నరకడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని,మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.