యాప్నగరం

తెలంగాణ కంటే కర్ణాటకే బెటరట! బోర్డర్‌లో షాకింగ్ ఘటన, కేసీఆర్ వ్యాఖ్యలకు ఫుల్ రివర్స్!!

కర్ణాటక సరిహద్దు ప్రాంతాల ప్రజలు, మహారాష్ట్రలోని నాందేడ్, ఏపీ నుంచి కూడా తెలంగాణలో కలపాలని వినతులు వస్తున్నాయంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు భిన్నమైన, షాకింగ్ ఘటన ఒకటి వెలుగుచూసింది.

Samayam Telugu 31 Oct 2021, 2:54 pm
తెలంగాణలో అమలవుతున్న పథకాలను చూసి పొరుగు రాష్ట్రాల ప్రజల నుంచి కూడా వినతులు వస్తున్నాయంటూ టీఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అటు నాందేడ్.. ఇటు ఆంధ్రా.. దక్షిణ తెలంగాణ బార్డర్‌లోని కర్ణాటక రాష్ట్రం రాయచూర్ ప్రాంత ప్రజలు కూడా తమను తెలంగాణలో విలీనం చేయాలని కోరుతున్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే అందుకు భిన్నంగా తెలంగాణ కాదు బాబోయ్.. కర్ణాటకే బెటర్ అంటోన్న షాకింగ్ ఘటన ఒకటి వెలుగుచూసింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
kcr


అది కూడా పొరుగు రాష్ట్రాల వారు కాదు.. ఏకంగా తెలంగాణ ప్రజానీకమే తెలంగాణ కంటే కర్ణాటకే బెటర్ అంటోన్న విచిత్ర పరిస్ధితి. తెలంగాణ - కర్ణాటక సరిహద్దు మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ మండలం కున్సి గ్రామ ప్రజలు కొన్నేళ్లుగా తమకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. ఎన్నోమార్లు పెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. నియోజకవర్గంలోని సరిహద్దు గ్రామాలైన చేగుంట, కున్సి గ్రామాలు కర్ణాటక రాష్ట్రం యాదగిరి - రాయచూర్ హైవేపై ఉంటాయి.

ఆ మార్గంలో కర్ణాటక రాయచూర్ నుంచి ఆర్టీసీ సర్వీసులు తిరుగుతుంటాయి. కున్సి గ్రామంలో బస్టాప్ ఉన్నా కర్ణాటక ఆర్టీసీ బస్సులకు స్టాప్ లేదు. ఒకవేళ కర్ణాటక బస్సులు ఎక్కినా 20 కిలోమీటర్ల దూరంలోని బస్టాప్ టిక్కెట్ తీసుకుని కున్సి గేటు దగ్గర దిగాల్సి వస్తోంది. ఇదే విషయమై పలుమార్లు కున్సి గ్రామ ప్రజలు తెలంగాన ఫ్రభుత్వానికి, అధికారులకు మొర పెట్టుకున్నారట. తమ గ్రామానికి టీఎస్‌ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని ఎన్నిసార్లు అడిగినా ప్రయోజనగం లేకపోయింది.

ఇక లాభం లేదనుకున్న గ్రామ ప్రజలు కర్ణాటకలోని రాయచూర్ ఎమ్మెల్యే శివరాజ్‌ పాటిల్‌ని కలసి తమ గోడు వెళ్లబోసుకున్నారట. ఆయన తక్షణం స్పందించి కర్ణాటక ఆర్టీసీ అధికారులతో మాట్లాడి కున్సి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించారు. తమ వినతికి స్పందించి బస్సు సౌకర్యం కల్పించిన రాయచూర్ ఎమ్మెల్యేకి గ్రామస్తులు ధన్యావాదాలు తెలియజేస్తున్నారు. తమను తెలంగాణ రాష్ట్రం కంటే కర్ణాటక ప్రభుత్వమే పట్టించుకుందని.. ఇకనైనా కర్ణాటక సరిహద్దు ప్రాంతాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని కోరుతున్నారంటూ పాలమూరు ఎమ్మెల్యేలు చెప్పడం మానుకోవాలని హితవు పలుకుతున్నారట.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.