యాప్నగరం

టిప్పర్ లారీ బీభత్సం.. కారుని ఢీకొట్టి.. మహబూబ్‌నగర్‌లో విషాదం

మహబూబ్‌నగర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కారుని టిప్పర్ లారీ ఢీకొనడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. పోలీసులు విచారణ చేపట్టారు.

Samayam Telugu 10 Mar 2021, 7:16 pm

ప్రధానాంశాలు:

  • కారుని ఢీకొట్టిన టిప్పర్ లారీ
  • ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత
  • ప్రాణాలు తీసిన అతివేగం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
accident
వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ బీభత్సం సృష్టించింది. కారుని ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరిగింది. భూత్పూరు మండలం మద్దిగట్ల స్టేజీ వద్ద ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన టిప్పర్ లారీ కారుని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అతను చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. మృతులను బిజినేపల్లి మండలం మంగనూరుకి చెందిన సత్యనారాయణ, వెంకటయ్యగా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.