యాప్నగరం

చెరువులో గుర్తు తెలియని మృతదేహాలు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

చెరువుపై వెళ్లిన స్థానికులు చెరువులో తేలాడుతున్న మృతదేహాల్ని చూశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు అయ్యింది.

Samayam Telugu 20 Jan 2021, 9:15 am
మహబూబ్ నగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని బాలానగర్‌ మండలంలో గుర్తుతెలియని మృతదేహాలు కలకలం సృష్టించాయి. మండలంలోని ఉడిత్యాల చెరువులో ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు తేలియాడుతూ ఉన్నాయి. బుధవారం ఉదయం అటుగా వెళ్లిన గ్రామస్థులు చెరువుపై చూడగా.. అనుమానంగా నీటిపై తేలియాడుతున్న మృతదేహాలను గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్థులకు కూడా విషయాన్ని చెరవేశారు.
Samayam Telugu చెరువులో మృతదేహాలు


Read More: నవదంపతుల్ని వెంటాడిన మృత్యువు.. మరణంలో కూడా వీడని బంధం

అయితేే చెరువు సమీపంలో ఓ బైక్‌ కూడా ఉన్నదని స్థానికులు చెబుతున్నారు. అయితే చనిపోయిన వారెవరూ అనే విషయం ఇంకా తెలియలేదు. పోలీసులు గుర్తుతెలియని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సహకా రంతో మృతదేహాలను చెరువులోనుంచి వెలికితీశారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదచేసి, దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతి చెందిన వారు ఎవరు ? ఎక్కడనుంచి వచ్చారు? ఆతహత్య చేసుకున్నారా లేక మరేమైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.