యాప్నగరం

ఓట్ల కోసం ఆరాటపడే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు.. ప్రజా సమస్యలపై పట్టింపు లేదు: షర్మిల

YS Sharmila: తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై.. వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సామాన్యుల సమస్యలపై పట్టింపు లేదని వ్యాఖ్యానించారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 13 Sep 2022, 3:57 pm

ప్రధానాంశాలు:

  • దేవరకద్ర నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర
  • టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వైఎస్ షర్మిల విమర్శలు
  • సామాన్యుల సమస్యలపై పట్టింపు లేదని వ్యాఖ్య
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Sharmila talking to women
మహిళలతో మాట్లాడుతున్న షర్మిల
YS Sharmila: ఓట్ల కోసం ఆరాటపడే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, సామాన్యుల సమస్యలపై మాత్రం పట్టింపు లేదని.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల ఆరోపించారు. ఎనిమిదేండ్లుగా ప్రజలు గోస పడుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. ప్రజా ప్రస్థానంలో సమస్యల గోడు వెళ్లబోసుకున్న పేదలకు అండగా నిలబడతామని.. త్వరలోనే వారి సమస్యలు పరిష్కరిస్తామని షర్మిల వ్యాఖ్యానించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో.. వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా.. టీఆర్ఎస్ (TRS Party) పార్టీపై షర్మిల విమర్శలు గుప్పించారు.
కేసీఆర్ (CM KCR) పాలనలో రుణమాఫీ లేదు.. ఫీజు రీయింబర్స్‌మెంట్ లేదని వైఎస్ షర్మిల ఆరోపించారు. పక్కా ఇండ్లు లేవు.. ఆరోగ్యశ్రీ లేదు.. ఉద్యోగాలు లేవని వ్యాఖ్యానించారు. పోడు పట్టాలు లేవు.. మహిళలకు రుణాలు లేవు.. ఇలా ఎన్నో పథకాలను అటకెక్కించారని ఆరోపించారు. వైఎస్సార్ (YSR) సంక్షేమ పాలనను మళ్లీ తీసుకురావడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. నిరుద్యోగుల ఆత్మబలిదానాల మీద సీఎం అయిన కేసీఆర్.. రాష్ట్రాన్ని శవాల దిబ్బ చేసి జాతీయ పార్టీ పెట్టేందుకు విధివిధానాలు రూపొందిస్తున్నారట అని ఎద్దేవా చేశారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.