యాప్నగరం

Galwan Clash: కల్నల్ సంతోష్ బాబుకు అరుదైన గౌరవం..!

గాల్వాన్ ఘర్షణల్లో అమరుడైన కల్నల్ సంతోష్ బాబుకు భారత ప్రభుత్వం శౌర్య పతకంతో గౌరవించనుంది. గాల్వన్ ఘర్షణల్లో అమరులైన ఐదుగురు సైనికులకు శౌర్య పతకాలు దక్కనున్నాయని సమాచారం.

Samayam Telugu 11 Jan 2021, 1:39 pm
గాల్వాన్ లోయలో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణల్లో వీరోచితంగా పోరాడి అమరుడైన కల్నల్ సంతోష్‌ బాబుకు అరుదైన గౌరవం దక్కనుందని తెలుస్తోంది. ఆయనతోపాటు అమరులైన 16 బిహార్ బెటాలియన్‌కు చెందిన కనీసం ఐదుగురు సైనికులను రిపబ్లిక్ డే రోజున శౌర్య పతకాలతో భారత ప్రభుత్వం గౌరవించనుందని సమాచారం.
Samayam Telugu colonl santosh babu


ఎన్ని మెడల్స్ అందజేస్తారనే విషయమై రక్షణ శాఖ, భారత సైన్యం ఇప్పటి వరకూ బయటకు వెల్లడించలేదు. కానీ చైనా సైన్యంతో వీరోచితంగా పోరాడిన ఇద్దరు ఆఫీసర్లు, ముగ్గురు ట్రూపర్లకు శౌర్య పతకాలు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.

భారత్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం గాల్వాన్ లోయ నుంచి వెనక్కి మళ్లేందుకు చైనా సైన్యం అంగీకరించింది. కానీ పెట్రోలింగ్ పాయింట్ 14 సమీప ప్రాంతం నుంచి వైదొలగలేదు. జూన్ 15న ఆ ప్రాంతంలో చైనా సైన్యం గుడారాలను గమనించిన భారత సైనికులు వెళ్లాల్సిందిగా సూచించారు. కానీ భారత సైనికులను దెబ్బ తీసేందుకు ముళ్ల తీగలు చుట్టిన కర్రలతో చైనా సైన్యం ముందుగానే ప్లాన్ ప్రకారం అక్కడికి వచ్చింది. కొద్ది మంది మాత్రమే భారత సైనికులు ఉన్నప్పటికీ.. ఏడు గంటలపాటు పోరాడి చైనా సైనికులను నిలువరించారు. ఈ ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు చనిపోగా.. ఓ కమాండింగ్ ఆఫీసర్ సహా చైనాకు చెందిన 43 మంది సైనికులు మరణించారని సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.