యాప్నగరం

పొలానికెళ్లిన తల్లి, కనిపించకుండా పోయిన కూతురు.. నల్గొండలో కలకలం

తల్లి పొలం పనులకు వెళ్లిన సమయంలో ఎదిగిన కూతురు కనిపించకుండా పోయింది. కంగారుపడిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

Samayam Telugu 24 Jan 2021, 2:10 pm
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
missing
నల్లగొండ జిల్లాలో ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తల్లి పొలంలో పని ఉందని వెళ్లిన కొద్దిసేపటికి కూతురు కనిపించకుండా పోవడం మిస్టరీగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నిడమానూరు మండలం తుమ్మడం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని పోతుగంటి శివరాణి(17) అదృశ్యమైంది. రెండు రోజుల కిందట తల్లి ఎల్లమ్మ పొలం పనులకు వెళ్లింది. ఆ సమయంలో కూతురు శివరాణి కనిపించకుండా పోయింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు పలు గ్రామాల్లో వెతికినా ఆచూకీ తెలియలేదు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. తమ కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.