యాప్నగరం

మందు తాగొద్దన్న తండ్రి.. మనస్థాపానికి గురైన కొడుకు.. సూర్యాపేటలో విషాదం

మద్యం తాగొద్దని తండ్రి మందలించడంతో కొడుకు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. మరుసటి రోజు శవమై కనిపించాడు. ఈ ఘటన కోదాడలో జరిగింది.

Samayam Telugu 14 Jan 2021, 5:41 pm
సూర్యాపేట జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన కొడుకుని తండ్రి మందలించాడని అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కోదాడ పట్టణంలోని శ్రీనివాసనగర్‌లో నివాసముంటున్న నలజాల సుబ్బారావుకు కూతురు, కొడుకు సంతానం. కొడుకు మురళి(30) మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మందు తాగి ఇంటికి వచ్చేవాడు. విసిగిపోయిన తండ్రి ఇంకా పెళ్లి కూడా కాలేదు.. అలా తాగి వస్తే ఎలా అంటూ తీవ్రంగా మందలించాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
liquor


తండ్రి కోప్పడ్డాడని తీవ్ర మనస్థాపానికి గురైన మురళి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఇంటికి సమీపంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. రేకుల షెడ్డులో ఫ్యానుకి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మరుసటి రోజు పాఠశాలకు వచ్చిన ఆయా ఉరికి వేలాడుతున్న యువకుడిని చూసి వెంటనే స్థానికులు, స్కూల్ యాజమాన్యానికి సమాచారం అందించింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.