యాప్నగరం

నేలపై పడుకున్న పసికందు.. పాముకాటుకు మృతి

ఇంట్లోకి ప్రవేశించిన పాము... నేలపై పడుకున్న 8 నెలల పసికందును కరిచింది. దీంతో చిన్నారిని వెంటనే తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఏరియా ఆస్పత్రిలో టీకా లేదని సిబ్బంది చెప్పారు.

Samayam Telugu 13 Jun 2021, 1:04 pm
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
సూర్యాపేట జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. పాము కాటుతో 8 నెలల పసిబిడ్డ హుజూర్ నగర్ మండలం బూరుగడ్డలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో నేలపై బాలుడు నిద్రిస్తుండగా ఇంట్లోకి వచ్చిన పాము బాలుడిని కాటు వేసింది. అయితే ఇంట్లో పామును గమనించిన తల్లిదండ్రులు వెంటనే బాలుడిని హుజూర్ నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

అయితే దగ్గరలో ఉన్న ఏరియా ఆస్పత్రికి వెళ్లిన తల్లిదండ్రులకు అక్కడి సిబ్బంది షాక్ ఇచ్చారు. తమ ఆస్పత్రిలో పాము కాటుకు టీకా లేదంటూ పట్టించుకోపోలేదు. దీంతో చిన్నారిని ఖమ్మం ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాలుడి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.