యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో గ్రామ ప్రజలతో కలిసి సీఎం కేసీఆర్ భోజనం చేసిన సంగతి తెలిసిందే. ఈ సహపంక్తి భోజనాల్లో ముగ్గురు వ్యక్తులతో కలిసి కేసీఆర్ కూర్చొని విందు ఆరగించారు. వీరిలో ఆకుల ఆగవ్వ అనే పెద్దావిడ కూడా ఉన్నారు. అయితే, తాజాగా ఆమె అస్వస్థతకు గురయ్యారు. ఈ నెల 22న సీఎం మీటింగ్ పెట్టిన రోజు రాత్రే ఆగవ్వ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను చికిత్స కోసం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. బుధవారం చికిత్స అందించి గురువారం ఆమెను వైద్యులు వాసాలమర్రికి తరలించారు. జూన్ 22న సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో పర్యటించిన సమయంలో గ్రామస్తులతో కలిసి సహ పంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో 3 వేల మంది గ్రామస్తులతో పాటు ఆకుల ఆగవ్వ కూడా పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ పక్కనే కూర్చుని ఆగవ్వ భోజనం చేశారు. వాసాలమర్రి గ్రామంలో ఆగవ్వ తనకు దోస్త్ అయిందని ప్రకటించారు. మొత్తం ముగ్గురు దోస్తుల్లో ఆకుల ఆగవ్వ కూడా అన్నారు. తనకు ఊర్లో ఫ్రెండు ఆగవ్వ ఒకరే ఉన్నారని, మొత్తం ఊరంతా దోస్తులు కావాలని కేసీఆర్ కోరారు.
KCR దోస్తు ఆకుల ఆగవ్వకు అస్వస్థత.. సీఎం పక్కనే కూర్చొని భోజనం
Vasalamarri: జూన్ 22న సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో పర్యటించిన సమయంలో గ్రామస్తులతో కలిసి సహ పంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో 3 వేల మంది గ్రామస్తులతో పాటు ఆకుల ఆగవ్వ కూడా పాల్గొన్నారు.
Samayam Telugu 24 Jun 2021, 9:37 pm
ప్రధానాంశాలు:
- వాసాలమర్రిలో ఆగవ్వకు అస్వస్థత
- కేసీఆర్ పక్కనే కూర్చున్న ఆకుల ఆగవ్వ
- ఆమె నా దోస్త్ అని చెప్పిన కేసీఆర్