యాప్నగరం

Tarun Chugh: 21న మునుగోడుకు అమిత్ షా.. బీజేపీలోకి భారీగా చేరికలు

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో 21న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నేతలు బీజేపీలో చేరతారని వెల్లడించారు.

Authored byవీరేష్ బిళ్ళ | Samayam Telugu 17 Aug 2022, 12:52 pm
మునుగోడు ఉపఎన్నిక(munugode bypoll) నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ(BJP) దూకుడు పెంచింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తమ పార్టీలో చేరనున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(Komatireddy Raj gopal reddy)ని మళ్లీ గెలిపించుకుని సత్తా చాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 21న మునుగోడులో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ ప్రకటించారు. ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగానే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సహా పలువురు నేతలు బీజేపీలో చేరనున్నారని వెల్లడించారు.
Samayam Telugu tarun chugh


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ తెలంగాణ అభివృద్ధి కోసం నిధులు ఇస్తుంటే.. కేసీఆర్ ప్రభుత్వం అందరికీ అన్యాయం చేస్తోందని తరుణ్ చుగ్ ఆరోపించారు. మునుగోడు సభ సాక్షిగా కేసీఆర్ చేస్తున్న దుర్మార్గాలను అమిత్ షా తెలంగాణ ప్రజలకు వివరిస్తారన్నారు. తెలంగాణలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేరని.. ప్రజలు ఆందోళన చేసే పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు. బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి కేసీఆర్ ఓర్వలేకపోతున్నారని.. అందుకే బీజేపీ ఎంపీలపై పోలీసులతో దాడులు చేయించారని ఆరోపించారు. బండి సంజయ్ చేపడుతున్న పాదయాత్రను టీఆర్ఎస్ వర్గాలు అడ్డుకునేందుకు చేస్తున్న దుర్మార్గాలను ప్రజలు చూస్తున్నారని పేర్కొన్నారు.

ఎనిమిదేళ్లుగా అనుభవిస్తున్న అధికారం చేజారిపోతుందన్న భయం కేసీఆర్‌లో కనిపిస్తోందని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో పోలీసుల వ్యవహార శైలి సక్రమంగా లేదని మండిపడ్డారు. బండి సంజయ్ పాదయాత్ర 26న కాకుండా 27న ముగింపు సభ నిర్వహిస్తున్నామని, ఆ సభకు జేపీ నడ్డా లేదా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యే అవకాశముందని తెలిపారు.
రచయిత గురించి
వీరేష్ బిళ్ళ
వీరేశ్ బిల్లా సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ రాజకీయ, సినీ రంగాలకు చెందిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. దీంతో పాటు వీడియో టీమ్‌కు సేవలు అందిస్తున్నారు. తనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించి ఆర్టికల్స్ రాశారు... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.