యాప్నగరం

దారి కాసి మహిళను కిడ్నాప్ చేేసి.. అడవిలోకి తీసుకెళ్లి హత్య.. సంచలన నిజాలు వెలుగులోకి!

సంస్థాన్ నారాయణ్‌పూర్ మండలంలోని గాంధీ నగర్ తండాలో ట్రక్కు డ్రైవర్‌గా పని చేసే రాజేశ్ కరెంట్ షాక్‌తో చనిపోయాడు. ఆయన చావుకు పక్కింటి మహిళ చాతబడి చేయడమే కారణమనే అనుమానంతో కుటుంబీకులు ఆమెను హతమొందించారు

Samayam Telugu 3 Feb 2021, 4:30 pm
చేతబడి చేస్తోందనే అనుమానంతో 45 ఏళ్ల మహిళను కిడ్నాప్ చేసి, హత్య చేసిన కేసులో యదాద్రి జిల్లా పోలీసులు ఏడుగుర్ని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సంస్థాన్ నారాయణ్‌పూర్‌ మండలంలోని గాంధీ నగర్ తండాకు చెందిన మోగవత్ నర్సింహ (30)కి కోళ్ల ఫారం ఉంది. ఆయన సోదరుడు నగేశ్ (26) ట్రక్కు డ్రైవర్‌గా పని చేసేవాడు. వీరి తండ్రి బద్దూ ట్రాక్టర్ డ్రైవర్. కాగా గత ఏడాది డిసెంబర్ 30న కోళ్ల ఫారంలో కరెంట్ షాక్ కొట్టడంతో రాజేశ్ ప్రాణాలు కోల్పోయాడు.
Samayam Telugu arrest repre
Representative image


నర్సింహ పక్కింట్లో బుజ్జి (45) అనే మహిళ తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. మంత్రాలతో రాజేశ్‌ చనిపోతాడని బుజ్జి గతంలో రాజేశ్ కుటుంబ సభ్యులను పదే పదే హెచ్చరించింది. ఆ తర్వాత నర్సింహ కోళ్ల ఫారంలోని కోళ్లు కూడా చనిపోయాయి. ఆయన భార్య అనారోగ్యం బారిన పడింది. బుజ్జి చేతబడి చేయడం వల్లే ఇలా జరుగుతోందని రాజేశ్ కుటుంబ సభ్యులు భావించారు.

దీంతో అదును చూసుకొని ఆమెను హత్య చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఆదివారం రోజున బుజ్జి, ఆమె భర్త గన్నా, అత్తయ్య రాగమ్మ రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని బండనేమురు గ్రామంలో ఫంక్షన్‌కు బయల్దేరారు. గన్నా, ఆయన తల్లి రాగమ్మ ఒక బైక్ మీద కూర్చోగా.. బుజ్జి తెలిసిన వారి బైక్ ఎక్కింది.

బుజ్జి ఎక్కిన బైక్‌ను ఆపిన నర్సింహ.. బైక్ నడుపుతున్న వ్యక్తిని కొట్టి.. ఆమెను తన కార్లో బలవంతంగా ఎక్కించుకున్నాడు. రాజకొండ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి చీరతో ఉరేసి హత్య చేశాడు. ఈ కేసులో నర్సింహతోపాటు.. ఆయన భార్య, తల్లిదండ్రులు, సహాయకులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.