యాప్నగరం

VRAలపై సీఎం సీరియస్.. కేసీఆర్‌కు కోమటరెడ్డి డెడ్‌లైన్!

వీఆర్ఏల సమస్యలు పరిష్కరించని వాళ్లు.. దేశం కోసం పార్టీ పెట్టి ఏం చేస్తారంటూ భువనగిరి ఎంపీ కోమటరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. యాదాద్రి జిల్లా భువనగిరిలోని గాంధీ పార్క్‌లోని మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 30 మంది వీఆర్ఏలు ఆత్మహత్య చేసుకున్నారని.. ఇప్పటికీ వీఆర్ఏల సమస్యలు పరిష్కరించలేదంటూ దుయ్యబట్టారు. రెండ్రోజుల్లో వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలంటూ కోమటరెడ్డి సీఎం కేసీఆర్‌కు డెడ్‌లైన్ విధించారు.

Edited byరావు | Samayam Telugu 2 Oct 2022, 12:41 pm

ప్రధానాంశాలు:

  • వీఆర్ఏల సమస్యలు పరిష్కరించరు.. దేశం కోసం పార్టీ అట
  • రెండ్రోజుల్లో వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి
  • వరంగల్ పర్యటనలో కేసీఆర్ తీరును ఖండిస్తున్నాం: ఎంపీ కోమటరెడ్డి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Komatireddy Venkata Reddy
కోమటరెడ్డి వెంకటరెడ్డి
వీఆర్‌ఏలపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారంటూ వస్తున్న వార్తలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. వరంగల్ పర్యటన నేపథ్యంలో కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసానికి నిన్న సీఎం కేసీఆర్ వెళ్లారు. ఆ సందర్భంగా వీఆర్ఏల సమస్యలపై వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తే.. వినతిపత్రాన్ని ముఖంపై విసిరేశారంటూ హనమకొండ జిల్లా కమలాపూర్ మండల అధ్యక్షుడు దుంపల సతీశ్ ఆరోపించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి తీరును ప్రతిపక్షాలు తప్పుబట్టాయి.
వీఆర్ఏల సమస్యలు పరిష్కరించని వాళ్లు.. దేశం కోసం పార్టీ పెట్టి ఏం చేస్తారంటూ భువనగిరి ఎంపీ కోమటరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. యాదాద్రి జిల్లా భువనగిరిలోని గాంధీ పార్క్‌లోని మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 30 మంది వీఆర్ఏలు ఆత్మహత్య చేసుకున్నారని.. ఇప్పటికీ వీఆర్ఏల సమస్యలు పరిష్కరించలేదంటూ దుయ్యబట్టారు. రెండ్రోజుల్లో వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలంటూ కోమటరెడ్డి సీఎం కేసీఆర్‌కు డెడ్‌లైన్ విధించారు.

వరంగల్ పర్యటనలో భాగంగా వీఆర్ఏలు తమ సమస్యలు పరిష్కరించాలని సీఎం దగ్గరికి వెళ్లే ఎలా ప్రవర్తించారో అందరూ చూశారని.. వరంగల్ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని కోమటరెడ్డి అన్నారు. ఓ వీఆర్వో, వీఆర్ఏ గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించారని గుర్తు చేశారు. ఇదే విషయమై బాధిత వీఆర్ఏ వీడియో రిలీజ్ చేస్తూ.. ముఖ్యమంత్రి వినతిపత్రం తీసుకోకపోగా.. రోడ్లపైకి వచ్చి కాన్వాయ్ ఆపుతున్నారని.. ఏం తమాషా చేస్తున్నారా? అంటూ వినతిపత్రాన్ని కింద పడేసి ఆగ్రహం వ్యక్తం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
రచయిత గురించి
రావు
గోనె.మహేష్ సమయం తెలుగులో కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ వెబ్‌స్టోరీ విభాగానికి సంబంధించి స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.