యాప్నగరం

Bandi Sanjay: అదే నిజమైతే నేను రాజీనామా చేస్తా.. సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్

Bandi Sanjay Kumar: కేసీఆర్ కుటుంబం మభ్యపెట్టే మాటలతో ప్రజల్ని మోసం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైరయ్యారు. రాష్ట్రంలో పంచ భూతాలను సైతం వ్యాపారంగా మార్చి దోపిడీకి తెరలేపారని ఆక్షేపించారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఓ అబద్ధమని.. నిజంగా 24 గంటల విద్యుత్ ఇస్తే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని అన్నారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 25 Feb 2023, 5:03 pm

ప్రధానాంశాలు:

  • కేసీఆర్ అబద్ధాలతో పబ్బం గడుపుతున్నారు
  • 24 గంటల ఉచిత విద్యుత్ ఓ బూటకం
  • అదే నిజమైత నేను రాజీనామా చేస్తా: బండి సంజయ్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Bandi Sanjay Kumar
బండి సంజయ్
Bandi Sanjay Kumar: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. కేసీఆర్ కుటుంబం పంచ భూతాలను సైతం వ్యాపారంగా మారుస్తున్నారని ధ్వజమెత్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో నిర్వహించిన ప్రజాగోస - బీజేపీ భరోసా (Praja Gosa BJP Bharosa) స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ కుటుంబం చేస్తున్న భూదందాలు, కమీషన్ల దోపిడీ భరించలేక విదేశీ పెట్టుబడిదారులు రాష్ట్రాన్నికి రాకుండా పారిపోతున్నారని అన్నారు. కేసీఆర్ అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 24 గంటల ఉచిత విద్యుత్ అంటూ అబద్ధాలు చెబుతున్నారన్నారు.
"24 గంటల విద్యుత్‌పై కేసీఆర్ చెప్పేవన్నీ వట్టి బూటకమే. 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే నేను నా పదవికి రాజీనామా చేస్తా. నిరూపించకపోతే కేసీఆర్ సీఎం పదవి నుంచి తప్పుకుంటారా ?. దేవుడిని, పంచభూతాలను సైతం వ్యాపారం చేసే మూర్ఖులు. 2023 నాటికి హైదరాబాద్ లైఫ్ సెన్సెస్ పరిశ్రమ విలువను 250 బిలియన్ డాలర్లకు పెంచుతానని కేటీఆర్ చెబుతున్నాడు. నిజానికి కల్వకుంట్ల కుటుంబం లేకపోతే 2030 నాటికి దాని విలువ 500 బిలియన్ డాలర్లకుపైగా ఉంటుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ కమీషన్ల భరించలేక పెట్టుబడులు వెనక్కి వెళ్తున్నాయి.

అమెరికాలో చిప్పలు కడిగి వచ్చి అయ్య పేరు చెప్పుకుని పదవులు సంపాదించిన కేటీఆర్ ఇవాళ నాపై అవాకులు చెవాకులు పేలుతున్నాడు. నీకులాగా తండ్రి పేరు చెప్పుకుని నేను పార్టీకి అధ్యక్షుడిని కాలేదు. పార్టీ కోసం కష్టపడి పైకి ఎదిగి వచ్చాను. బీజేపీలో సామాన్య కార్యకర్త సైతం సీఎం, పీఎం, అధ్యక్షులు అవుతారు. అదే బీఆర్ఎస్ పార్టీలో ఓ కార్యకర్త అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కాగలరా ? కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటాడు. తంబాకుకు, లవంగానికి తేడా కూడా తెలియని మూర్ఖుడు కేటీఆర్. డ్రగ్స్ టెస్ట్‌కు రావాలని పిలిస్తే తోక ముడిచిన ఒంట్లో నుంచి డ్రగ్స్ ఆనవాళ్లన్నీ పోయాయని తెలిశాక ఇప్పుడు వచ్చి వాగుతున్నాడు. అని బండి సంజయ్ ఫైరయ్యారు.

బీజేపీ అధికారంలోకి వస్తే ఎంత వరకు చదివితే అంత వరకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తాం. మోదీ ప్రభుత్వం గత 3 నెలల్లోనే 2.16 లక్షల ఉద్యోగాలకు సంబంధించి అపాయిట్మెంట్ లెటర్లు కూడా ఇచ్చింది. కేంద్రంలోని మోడీ పాలనను చూసి 150 దేశాలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. గత 75 ఏళ్లలో దేశానికి ఎన్ని బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయో అందులో 50 శాతానికిపైగా మోడీ పాలనలోనే వచ్చాయి. నయీం ఆస్తులను కేసీఆర్ కుటుంబం దోచుకుంది. నయీం ఆస్తులను ఎవరూ కొనుగోలు చేయవద్దు. తాము అధికారంలోకి వస్తే నయీం ఆస్తులను స్వాధీనం చేసుకుంటాం. రామరాజ్యం రావాలంటే పువ్వు గుర్తుకే ఓటేయాలి." అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.